Gangula Kamalakar : జూన్ 10వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు… 24 గంటల కరెంటుతో అధిక దిగుబడి వచ్చిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 10వ తేదీ చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూన్ 10వ తేదీ నాటికి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 2022 జూన్ 10వ తేదీ నాటికి కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు 9 లక్షల 50వేల మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకున్నారని, 12,450 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు మంత్రి గంగుల.
Mahesh Kumar Goud : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
అంతేకాకుండా.. ‘తొలుత తెలంగాణ వ్యాప్తంగా 7,192 ధాన్యం కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ… 7,034 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. గతంలో 4,135 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పటివరకు 6వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. మిగతా డబ్బులను సైతం జూన్ 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. రెండవ పంటను కొనుగోలు చేసి ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. జూన్ 16వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను క్లోస్ చేస్తాం. ఆలస్యంగా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతిని ఇస్తాం. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. స్వయంపాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అవతరించింది… అభివృద్ధి మీ కళ్ళకే కనిపిస్తుంది. ఇప్పుడు సుందరంగా తీర్చిదిద్దాం. సివిల్ ఇంజనీర్గా ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలకు గొప్ప నగరాన్ని అందించాలని కృషి చేస్తున్నాను. కరీంనగరం బ్రహ్మోత్సవాలు కలోత్సవాలు చిత్రోత్సవాలకు వేదికగా మారింది.
సౌత్ ఇండియాలోనే తొలి కేబుల్ బ్రిడ్జిని ఈనెల 21వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. ఈ కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు కన్నా అడ్వాన్సుగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జిలో 10/30 అడుగుల స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అదేరోజు సెంట్రల్ లైటింగ్ అని కూడా ప్రారంభించుకుంటాం. 21వ తేదీన కేబుల్ బ్రిడ్జితో పాటు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం… ట్రాఫిక్ సిగ్నల్స్.. ఫ్రీ వైఫై ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు లైటింగ్ సిస్టం క్రాకర్షూ లేజర్ షో బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు బ్రిడ్జి పైకి వాహనాలను అనుమతించం. ఊహకు అందని విధంగా ఎంఆర్ఎఫ్ ను నిర్మిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీన మొదటి దశ ఎంఆర్ఎఫ్ ను ప్రారంభిస్తున్నాం. అదేరోజు ప్రపంచంలోనే మూడవదైన అతి పెద్ద ఫౌంటెన్ ప్రారంభిస్తాం. 72 కోట్లతో నిర్మించనున్న ఈ ఫౌంటెన్ టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి. ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నాం. రాజకీయ విమర్శలు పట్టించుకోము… దీవెనార్థులు అనుకుంటాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?