Gangula Kamalakar : జూన్ 10వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు… 24 గంటల కరెంటుతో అధిక దిగుబడి వచ్చిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 10వ తేదీ చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూన్ 10వ తేదీ నాటికి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 2022 జూన్ 10వ తేదీ నాటికి కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు 9 లక్షల 50వేల మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకున్నారని, 12,450 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు మంత్రి గంగుల.
Mahesh Kumar Goud : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
అంతేకాకుండా.. ‘తొలుత తెలంగాణ వ్యాప్తంగా 7,192 ధాన్యం కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ… 7,034 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. గతంలో 4,135 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పటివరకు 6వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. మిగతా డబ్బులను సైతం జూన్ 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. రెండవ పంటను కొనుగోలు చేసి ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. జూన్ 16వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను క్లోస్ చేస్తాం. ఆలస్యంగా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతిని ఇస్తాం. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. స్వయంపాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అవతరించింది… అభివృద్ధి మీ కళ్ళకే కనిపిస్తుంది. ఇప్పుడు సుందరంగా తీర్చిదిద్దాం. సివిల్ ఇంజనీర్గా ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలకు గొప్ప నగరాన్ని అందించాలని కృషి చేస్తున్నాను. కరీంనగరం బ్రహ్మోత్సవాలు కలోత్సవాలు చిత్రోత్సవాలకు వేదికగా మారింది.
సౌత్ ఇండియాలోనే తొలి కేబుల్ బ్రిడ్జిని ఈనెల 21వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. ఈ కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు కన్నా అడ్వాన్సుగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జిలో 10/30 అడుగుల స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అదేరోజు సెంట్రల్ లైటింగ్ అని కూడా ప్రారంభించుకుంటాం. 21వ తేదీన కేబుల్ బ్రిడ్జితో పాటు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం… ట్రాఫిక్ సిగ్నల్స్.. ఫ్రీ వైఫై ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు లైటింగ్ సిస్టం క్రాకర్షూ లేజర్ షో బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు బ్రిడ్జి పైకి వాహనాలను అనుమతించం. ఊహకు అందని విధంగా ఎంఆర్ఎఫ్ ను నిర్మిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీన మొదటి దశ ఎంఆర్ఎఫ్ ను ప్రారంభిస్తున్నాం. అదేరోజు ప్రపంచంలోనే మూడవదైన అతి పెద్ద ఫౌంటెన్ ప్రారంభిస్తాం. 72 కోట్లతో నిర్మించనున్న ఈ ఫౌంటెన్ టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి. ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నాం. రాజకీయ విమర్శలు పట్టించుకోము… దీవెనార్థులు అనుకుంటాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!