Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Former Ttd Chairman Bhumana Karunakar Reddy Made Sensational Allegations Regarding The Death Of Cows In Ttd Cowshed

Bhumana Karunakar Reddy: ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది.. ఇది చంద్రబాబు, పవన్ చేసిన పాపమే..!

Published Date :April 11, 2025 , 12:29 pm
By Sudhakar Ravula
  • ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది..
  • ఇది చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ చేసిన పాపమే..
  • టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి‌ ఆరోపణ..
Bhumana Karunakar Reddy: ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది.. ఇది చంద్రబాబు, పవన్ చేసిన పాపమే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhumana Karunakar Reddy: ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది.. ఇది సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన పాపమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి‌.‌‌. తిరుపతిలోమీడియాతో మాట్లాడిన ఆయన.. గోవులు దేవుళ్లతో సమానం.. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయి.. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది గోమాత‌.. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా.. పట్టించుకోకుండా ఉన్నారు.. ఎస్వీ గోశాలలో గోవులను దుస్థితి దారుణంగా ఉంది. వందకు పైగా ఆవులు చనిపోయాయి.. ఆ లెక్కలు, ఆవుల మృతి బయటకు రాకుండా చూశారు.. కనీసం పోస్టు మార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. ఈ మహాపాపం టీటీడీది, ప్రభుత్వానిది కాదా ? అని నిలదీశారు.

Read Also: Allahabad High Court: టీషర్ట్తో కోర్టుకు హాజరైన లాయర్.. 6 నెలల జైలు శిక్ష విధించిన జడ్జి

Also Read

  • Fuel Shortage: పెట్రోల్‌ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
  • AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
  • Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
  • AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ కొరత ప్రభావం.. లిమిట్‌ పెంచిన బంక్‌లు..

గోశాలపై పర్యవేక్షణలో అధికారి లేకపోవడంతోనే ఈ దుస్థితికి కారణం అన్నారు కరుణాకర్‌రెడ్డి.. గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసిన ఆయన.. ఎస్వీ గోశాల నుండి తిరుమలకు పాలు వెళ్తాయి.. స్వామి వారికి నైవేద్యంగా వెన్న ఇక్కడ నుండి ఇస్తారు.. వైసీపీ పాలనలో గుజరాత్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల నుండి ఆవులను తీసుకోచ్చి స్వామి వారి సేవలు అందించాం.. 580 ఆవులను మా ప్రభుత్వంలో తీసుకొచ్చాం… వైసిపి పాలనలో 1500 లీటర్ల పాలు తిరుమలకు రోజు అందించాం.. ఇప్పుడు కూటమీ ప్రభుత్వం ఐదు వందల లీటర్ల పాలు తిరుమలకు వెళ్లడం లేదని విమర్శించారు.. అయితే, పవన్ కల్యాణ్, చంద్రబాబు.. జగన్ పై అసత్య ప్రచారం చేశారు.. కానీ, హిందు ధర్మాన్ని కాపాడింది జగన్‌‌.. కూటమీ ప్రభుత్వం టిటిడి ఎస్వీ గోశాలనే రక్షించలేకపోయారు.. అక్కడి అధికారుల నిర్లక్ష్యంతోనే గోవులను చనిపోయాయి… ఇప్పటి వరకు టీటీడీ జేఈవో, సీవీ ఎస్వీ సహా ఇతర అధికారులను నియమించలేదు… తొక్కిసలాట ఘటనలో ఏమాత్రం సంబంధం లేని ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాధ్ రెడ్డి కావాలనే సస్పెండ్ చేసి.. ఇప్పుడు గోవుల మృతికి చంద్రబాబు కారణం అయ్యారని దుయ్యబట్టారు..

Read Also: Gold Rate Today: నిన్న రూ.2940, నేడు రూ.2020.. ఇక బంగారం కొనడం కష్టమేనా?

ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది.. గోవులను మరణాలపై హిందువులు నిరసనలు చేపట్టాలి‌‌‌… టిటిడి అనుమతి ఇస్తే ఈ రోజే ఎస్వీ గోశాలకు వెలుతాను.. గోవులను మృతికి టిటిడినే కారణం… వారి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు కరుణాకర్‌ రెడ్డి.. వెంటనే అక్కడి పరిస్థితి టిటిడి చక్కదిద్దడానికి ప్రయత్నం చేయాలి.. ఇది చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసినా పాపం మే అన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Bhumana Karunakar Reddy
  • cm chandrababu
  • Cows
  • pawan kalyan

తాజావార్తలు

  • Fuel Shortage: పెట్రోల్‌ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..

  • AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!

  • Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం

  • AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ కొరత ప్రభావం.. లిమిట్‌ పెంచిన బంక్‌లు..

  • Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions