Tamilisai Soundarajan: బీజేపీలో చేరిన తమిళిసై.. పోటీ ఎక్కడ నుంచంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బీజేపీలో చేరారు. బుధవారం చెన్నైలో ఆమె కమలం పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమక్షంలో తమిళిసై పువ్వు పార్టీలో చేరారు. ఆమె మెడలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగానే ఆమోదించారు. అలాగే మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా రాజీనామా లేఖను పంపించారు.
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె రాజీనామా చేశారు. ప్రజాసేవ చేసేందుకు తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు తమిళిసై వెల్లడించారు. నిజాయితీ రాజకీయాలు చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె తెలిపారు.
తమిళిసై.. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో తమిళిసై ఓడిపోయారు. గత ఏడాది నుంచి తమిళిసై తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వినిపించాయి. మొత్తానికి గవర్నర్ పదవికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో తమిళిసై పదవీకాలం మరో ఆరు నెలలు, పుదుచ్చేరిలో మరో రెండేళ్లు ఉంది.
ఇదిలా ఉంటే బీజేపీ మూడో జాబితా త్వరలో విడుదలకానుంది. తొలి విడతలోనే తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. బుధవారమే తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్లోనే తమిళనాడు ఎన్నికలు ఉండడంతో తమిళిసై పేరు మూడో జాబితాలో ఉండనుంది. ట్యూటికోరిన్ నియోజకవర్గం నుంచే తమిళిసై మళ్లీ పోటీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా… జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Former Telangana Governor Tamilisai Soundarajan joins BJP
Read @ANI Story | https://t.co/lJa9QyPnag#TamilisaiSoundarajan #BJP #TamilNadu pic.twitter.com/vy2GmW6ULv
— ANI Digital (@ani_digital) March 20, 2024
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!