Tamilisai Soundarajan: బీజేపీలో చేరిన తమిళిసై.. పోటీ ఎక్కడ నుంచంటే..!
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బీజేపీలో చేరారు. బుధవారం చెన్నైలో ఆమె కమలం పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమక్షంలో తమిళిసై పువ్వు పార్టీలో చేరారు. ఆమె మెడలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగానే ఆమోదించారు. అలాగే మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా రాజీనామా లేఖను పంపించారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె రాజీనామా చేశారు. ప్రజాసేవ చేసేందుకు తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు తమిళిసై వెల్లడించారు. నిజాయితీ రాజకీయాలు చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె తెలిపారు.
తమిళిసై.. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో తమిళిసై ఓడిపోయారు. గత ఏడాది నుంచి తమిళిసై తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వినిపించాయి. మొత్తానికి గవర్నర్ పదవికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో తమిళిసై పదవీకాలం మరో ఆరు నెలలు, పుదుచ్చేరిలో మరో రెండేళ్లు ఉంది.
ఇదిలా ఉంటే బీజేపీ మూడో జాబితా త్వరలో విడుదలకానుంది. తొలి విడతలోనే తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. బుధవారమే తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్లోనే తమిళనాడు ఎన్నికలు ఉండడంతో తమిళిసై పేరు మూడో జాబితాలో ఉండనుంది. ట్యూటికోరిన్ నియోజకవర్గం నుంచే తమిళిసై మళ్లీ పోటీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా… జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Former Telangana Governor Tamilisai Soundarajan joins BJP
Read @ANI Story | https://t.co/lJa9QyPnag#TamilisaiSoundarajan #BJP #TamilNadu pic.twitter.com/vy2GmW6ULv
— ANI Digital (@ani_digital) March 20, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో