Manmohan Singh: మోడీని ఆ విషయంలో మెచ్చుకున్న మన్మోహన్ సింగ్
Former PM Manmohan Singh Praises Narendra Modi: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు జీ20 సమావేశాలకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను మాట్లాడారు మన్మోహన్ సింగ్. జీ20 సమావేశాలకు ఇండియా అతిథ్యం ఇవ్వడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్య దేశాల అధినేతాలతో దేశంలో సమావేశం ఏర్పటు చేయడం తాను చూడగలడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు మన్మోహన్. ప్రస్తుతకాలంలో విదేశాంగ విధానం ప్రాముఖ్యత మరింత పెరిగిందని, ఇక దేశానికి ఇది చాలా ముఖ్యమని మాజీ ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ పాలనలో విదేశీ విధానం జోక్యం చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
Also Read: Yogi Adityanath: రావణుడు, కంసుడి వల్లే కాలేదు.. “సనాతన” వ్యాఖ్యలపై యోగి కామెంట్స్..
Also Read
- Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
ఇక చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జీ20 సమావేశాలకు గైర్హజరు కావడం పై కూడా మన్మోహన్ సింగ్ స్పందించారు. ఆయన రాకపోవడం బాధాకరమన్నారు. ఇక భారత్-చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంలో మోడీ ఆచీతూచీ వ్యవహరించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు మన్మోహన్ తెలిపారు. ఇక ఈ విషయంలో సలహా ఇవ్వడానికి ఇది సరైన వేదిక కాదన్నారు. ఈ వేదికపై సరిహద్దు వివాదాల గురించి కాకుండా వాతావరణ మార్పులు, గ్లోబల్ ట్రేడ్ పాలసీలు, అసమానతల గురించి ఈ వేదికపై చర్చించుకోవడం మంచిదని మన్మోహన్ సింగ్ అభిప్రాయ పడ్డారు. ఇక చైనా-ఉక్రెయిన్ విషయంలో మోదీ వైఖరిని మాజీ ప్రధాని సమర్థించారు. రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతున్నప్పుడు ఏదో ఒక దేశం వైపు నిలబడాలనే ఒత్తిడి సాధారణంగా ఉంటుందన్న ఆయన ఈ విషయంలో భారత సర్కార్ గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ఆకాంక్షలను ద్రుష్టిలో పెట్టుకొని తటస్థంగా వ్యవహరించడం గొప్ప నిర్ణయం అని, అదే సమయంలో శాంతిగా ఉండాలని కూడా మోడీ ఇరు దేశాలకు సూచించడం మంచి విషయం అన్నారు. ఈ విషయంలో భారత్ ఉన్నతంగా వ్యవహరించిందని మన్మోహన్ మోడీని కొనియాడారు. ఇక యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు ఒకసారి, 2009 నుంచి 2014 వరకు మనోహ్మన్ సింగ్ దేశానికి ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో