Manmohan Singh: మోడీని ఆ విషయంలో మెచ్చుకున్న మన్మోహన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former PM Manmohan Singh Praises Narendra Modi: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు జీ20 సమావేశాలకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను మాట్లాడారు మన్మోహన్ సింగ్. జీ20 సమావేశాలకు ఇండియా అతిథ్యం ఇవ్వడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్య దేశాల అధినేతాలతో దేశంలో సమావేశం ఏర్పటు చేయడం తాను చూడగలడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు మన్మోహన్. ప్రస్తుతకాలంలో విదేశాంగ విధానం ప్రాముఖ్యత మరింత పెరిగిందని, ఇక దేశానికి ఇది చాలా ముఖ్యమని మాజీ ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ పాలనలో విదేశీ విధానం జోక్యం చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
Also Read: Yogi Adityanath: రావణుడు, కంసుడి వల్లే కాలేదు.. “సనాతన” వ్యాఖ్యలపై యోగి కామెంట్స్..
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
ఇక చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జీ20 సమావేశాలకు గైర్హజరు కావడం పై కూడా మన్మోహన్ సింగ్ స్పందించారు. ఆయన రాకపోవడం బాధాకరమన్నారు. ఇక భారత్-చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంలో మోడీ ఆచీతూచీ వ్యవహరించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు మన్మోహన్ తెలిపారు. ఇక ఈ విషయంలో సలహా ఇవ్వడానికి ఇది సరైన వేదిక కాదన్నారు. ఈ వేదికపై సరిహద్దు వివాదాల గురించి కాకుండా వాతావరణ మార్పులు, గ్లోబల్ ట్రేడ్ పాలసీలు, అసమానతల గురించి ఈ వేదికపై చర్చించుకోవడం మంచిదని మన్మోహన్ సింగ్ అభిప్రాయ పడ్డారు. ఇక చైనా-ఉక్రెయిన్ విషయంలో మోదీ వైఖరిని మాజీ ప్రధాని సమర్థించారు. రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతున్నప్పుడు ఏదో ఒక దేశం వైపు నిలబడాలనే ఒత్తిడి సాధారణంగా ఉంటుందన్న ఆయన ఈ విషయంలో భారత సర్కార్ గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ఆకాంక్షలను ద్రుష్టిలో పెట్టుకొని తటస్థంగా వ్యవహరించడం గొప్ప నిర్ణయం అని, అదే సమయంలో శాంతిగా ఉండాలని కూడా మోడీ ఇరు దేశాలకు సూచించడం మంచి విషయం అన్నారు. ఈ విషయంలో భారత్ ఉన్నతంగా వ్యవహరించిందని మన్మోహన్ మోడీని కొనియాడారు. ఇక యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు ఒకసారి, 2009 నుంచి 2014 వరకు మనోహ్మన్ సింగ్ దేశానికి ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!