Margani Bharat: వారిపై చర్యలు తీసుకొండి.. పోలీసులకు మాజీ ఎంపీ ఫిర్యాదు
- తమ ఇష్టా రాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్
- రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు
- అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే తమ ఇష్టా రాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పోలీసులను కోరారు.. రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ పుటేజీ, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి ఈ సందర్భంగా మాజీ ఎంపీ అందజేశారు. సీతంపేట మూలగొయ్యికి చెందిన సాయి అనే యువకుడిపై టీడీపీకి చెందిన కొంతమంది మారణాయుధాలతో దాడిచేశారని, బాధితుని తలకు నాలుగు కుట్లు పడ్డాయని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు. గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Noor Malabika: నూర్ మరణంపై మౌనం వీడిన కుటుంబ సభ్యులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
Also Read
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని భరత్ కోరారు. పోలీసులు తగు చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నానని, న్యాయం జరగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మాజీ ఎంపీ భరత్ చెప్పారు. ఇటువంటి దాడులు మళ్లీ మళ్లీ నగరంలో జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదన్నారు. రాజమండ్రి నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలన్నదే తమ అభిలాష అన్నారు. క్రమ శిక్షణ గల పార్టీ అని చెప్పే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్భలంతోనే మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, వారందరి పేర్లూ అడిషనల్ ఎస్పీకి అందజేశామన్నారు. టీడీపీ క్రమశిక్షణ ఇదేనా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ భరత్.
తాజావార్తలు
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!