MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?
- నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్
- తొలి దశలో రాష్ట్రంలోని 43 స్థానాలకు ఓటింగ్.
- మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అతని కుటుంబం సభ్యులు ఓటు వేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Cast Vote: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ నేడు జరుగుతుంది. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీకి మొదటి దశకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. తొలి దశలో రాష్ట్రంలోని 43 స్థానాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని దాదాపు 1.37 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.28 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. 43 స్థానాలకు జరుగుతున్న ఈ ఓటింగ్ ప్రక్రియలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వెటరన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అతని కుటుంబం సభ్యులు మొత్తం మధ్యాహ్నం హతియా అసెంబ్లీలోని బూత్ నంబర్ 380లో ఓటు వేశారు. ఈ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీతో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపించారు. ఆ సమయంలో భద్రత వలయాలు ప్రజల నుండి ధోనికి రక్షణ కల్పించారు. మహేంద్ర సింగ్ ధోనీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ కూడా.
Read Also: Kulgam Encounter: కుల్గామ్లో ఎన్కౌంటర్.. 24 గంటల్లో రెండో ఎన్కౌంటర్
Also Read
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
- Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
- Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
మహేంద్ర సింగ్ ధోనీ పోలింగ్ బూత్కు చేరుకున్న వెంటనే, అతని అభిమానులు ధోని కోసం అరవడం, కేకలు వేయడంతో అక్కడ కొద్దీ సేపు కోలాహల వాతావరణం ఏర్పడింది. ఈ సంఘటనతో ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో, అతనికి ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. కొందరు అతడిని కలవడానికి తహతహలాడారు. రాంచీలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ధోనీ ఇల్లు రాంచీ రింగ్ రోడ్లో ఉంది. ఓటు వేయడం ద్వారా బాధ్యత గల పౌరుడిగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also: Chennai: తల్లిపై మమకారం.. వైద్యం సరిగా చేయలేదని డాక్టర్పై కొడుకు దాడి
#WATCH | Former Indian cricket team captain MS Dhoni along with his wife, Sakshi arrives at a polling booth in Ranchi to cast his vote for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/KlD68mXdzM
— ANI (@ANI) November 13, 2024
తాజావార్తలు
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!