Chennai: తల్లిపై మమకారం.. వైద్యం సరిగా చేయలేదని డాక్టర్పై కొడుకు దాడి
- తల్లిపై కుమారుడు మమకారం
- వైద్యం సరిగా చేయలేదని డాక్టర్పై కత్తితో దాడి
- చెన్నైలోని కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లిపై బిడ్డలకు మమకారం ఉంటుంది. మాతృమూర్తికి కష్టం వస్తే పేగు పంచుకుని పుట్టిన బిడ్డలు సహించలేరు. ఆ గుండెలు తల్లడిల్లిపోతాయి. కారణం.. తల్లి, బిడ్డల మధ్య ఉండే రిలేషన్ అలాంటిది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.
కన్నతల్లికి సరైన వైద్యం చేయలేదని డాక్టర్పై ఓ కొడుకు పగ పెంచుకున్నాడు. అదునుకోసం ఎదురుచూస్తున్న కుమారుడు.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి వైద్యుడ్ని కత్తితో పొడిచాడు. పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
విఘ్నేష్ అనే వ్యక్తి.. తన తల్లికి జరుగుతున్న కేన్సర్ చికిత్సపై అసంతృప్తిగా ఉన్నాడు. 2024, మే నెల నుంచి కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. అయితే తల్లి ఆరోగ్యం మెరుగుపడలేదు. వైద్యుడు సరైన మందులు రాయడంలేదన్న అనుమానంతో డాక్టర్పై కోపం పెంచుకున్నాడు. దీంతో నవంబర్ 13న (బుధవారం) డాక్టర్ బాలాజీ కేన్సర్ వార్డులో పనిలో నిమగ్నమైయున్నాడు. ఇంతలో విఘ్నేష్ అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించి కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. విఘ్నేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన తల్లికి సరైన వైద్యం చేయలేదన్న అనుమానంతో డాక్టర్ బాలాజీపై దాడి చేశాడని అధికారి తెలిపారు. బాలాజీ హార్ట్ పేషెంట్ అని చెప్పారు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. గాయపడిన వైద్యుడికి అవసరమైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమయంతో నిమిత్తం లేకుండా సేవలు అందిస్తోన్న వైద్యుల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడితో వైద్యుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!