Maharashtra Elections: 288 అసెంబ్లీ స్థానాలకు 7995 మంది అభ్యర్థులు.. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నరంటే?
- మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు
- మంగళవారం (అక్టోబర్ 29) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.
- 7995 మంది అభ్యర్థుల నామినేషన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Elections: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం (అక్టోబర్ 29) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. సుమారు 8 వేల మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నవంబర్ 20న జరగనున్న ఎన్నికల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్కు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 22న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 29వ తేదీతో ముగిసింది. నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 30న జరుగుతుందని, అభ్యర్థులు నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అందిన సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో 148 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
Also Read
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
అలాగే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాగా, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 53 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. మహాయుతి ఇతర మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇవ్వగా, రెండు సీట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపక్షం మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి) 89 స్థానాల్లో, ఎన్సిపి (ఎస్పి) 87 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇతర ఎంవీఏ మిత్రపక్షాలకు ఆరు సీట్లు ఇవ్వగా, మూడు అసెంబ్లీ స్థానాలపై స్పష్టత లేదు. దీనితో పాటు, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 14 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది.
Also Read: China Launched Shenzhou-19: షెన్జౌ-19 అంతరిక్ష యాత్రను ప్రారంభించిన చైనా
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!