Flight Ticket: కేవలం రూ.150కే విమానంలో ప్రయాణించే అవకాశం.. ఎక్కడంటే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఎప్పుడైనా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నప్పుడు రోడ్డు మార్గం లేదా రైలు మార్గాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇక సముద్రాల తీరాలలో ఉన్నవారు పడవ ప్రయాణాలను కూడా ఆశ్రయిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే విమాన మార్గాలను ఎంచుకుంటారు. దీని కారణం ఫ్లైట్ టికెట్ ధరలు. ఒక మనిషి ఫ్లైట్ ఎక్కి దిగాలంటే మినిమం 1000 రూపాయలైనా కట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పేద, మధ్యతరగతి వ్యక్తులు విమాన ప్రయాణాలకు కాస్త దూరంగానే ఉంటారు. ఇకపోతే అందరికీ విమాన ప్రయాణాన్ని అందించాలన్న నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ అనే ఓ అద్భుతమైన స్కీం అమలు చేస్తోంది.
Also read: TTD : శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఎల్లుండి దర్శన టికెట్లు విడుదల..!
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ఈ స్కీం లో భాగంగా ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రోత్సహించడంతో పాటు.. సాధారణ ప్రజలకు కూడా విమాన ప్రయాణాలు అందుబాటులోకి తెచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. 2016 అక్టోబర్ 21న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రధాన నగరాలకు సంబంధించి విమానా టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా రీజనల్ కనెక్టివిటీ స్కీం ఆర్సిఎస్ లలో చేరే విమాన సంస్థలు కేవలం 50 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణానికి గాను టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి.
Also read:WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. స్టేటస్ కోసం..
ఇక ఈ స్కిం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది. ఈ నేపధ్యంలో అలయన్స్ ఎయిర్లైన్స్ కేవలం రూ. 150 లకే విమాన టికెట్స్ ను అందిస్తోంది. ఈ టికెట్ ధర అస్సాం లోని లీలామరి నుండి తేజ్ పూర్ నగరాల మధ్య ఉంది. మొత్తానికి ఈ ప్రయాణ దూరం 186 కిలోమీటర్లు. 150 రూపాయలు అనేది టికెట్ బేస్ ధర. అయితే వీటిపై కన్వీనియన్స్ ఫీజు, జిఎస్టి, ఇతర అనేక టాక్స్ లు కలిపి మొత్తంగా మరో 325 కలపబడతాయి. దీంతో ఈ టికెట్ మొత్తం ఇతర రూ. 475. అయితే 186 కిలోమీటర్లకి 475 రూపాయలు పెట్టడం సమంజసమే. ఇలా విమాన చార్జీలను తక్కువ ధరలకు అందించడం నిజంగా అభినందించ విషయమే. వీటితోపాటు మరికొన్ని రూట్లలలో కూడా మనదేశంలో ఇలా తక్కువ ధరలకే విమాన ప్రయాణాలను చేయవచ్చు.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!