శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో జూలై నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లను టీటీడీ విడుదల చేయనుంది. 22వ తేది ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్నట్లు, 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది టీటీడీ. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. 24వ తేది ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనున్న టీటీడీ. 27వ తేది ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల చేయనుంది.