Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
- బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
- ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. 27 మంది గాయపడ్డారు. లంబి నియోజకవర్గానికి సమీపంలోని సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామంలోని పొలాల్లో ఉన్న బాణసంచా కర్మాగారంలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని బతిండా ఎయిమ్స్కు తరలించారు. ఈ పేలుడులో, ఫ్యాక్టరీ భవనంలోని రెండు అంతస్తులు క్షణాల్లో పేక ముక్కలా కుప్పకూలాయి. కర్మాగారంలో బాణసంచా తయారీ పని ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ నివాసి అయిన కాంట్రాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుండగా, సంఘటన జరిగినప్పటి నుంచి కాంట్రాక్టర్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read:Liquor Case: లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి నలుగురు నిందితులు.. విచారణకు కోర్టు అనుమతి..!
Also Read
- Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ఫ్యాక్టరీ ప్యాకింగ్ యూనిట్లో పనిచేస్తున్న వలస కార్మికుల ప్రకారం, దాదాపు 40 మంది ఉద్యోగులు అక్కడ రెండు షిఫ్టులలో పనిచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ మంది ఉద్యోగులు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారని చెబుతున్నారు. ఆర్టిసన్ అరుణ్ సక్సేనా మాట్లాడుతూ, తాను అర్థరాత్రి ఫ్యాక్టరీ ముందు నిద్రపోతున్నానని చెప్పాడు. అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని తెలిపాడు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఎస్పీ డాక్టర్ అఖిల్ చౌదరి, ఎస్పీ (డి) మన్మీత్ సింగ్, లంబి డిఎస్పీ జస్పాల్ సింగ్, కిలియన్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి కరమ్జిత్ కౌర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read:Am Ratnam : ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోవడంపై దయాకర్ క్లారిటీ..
డేరా సచ్చా సౌదా సిర్సాకు చెందిన గ్రీన్ ఎస్ ఫోర్స్ కార్మికులు సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హైడ్రో మెషిన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ కర్మాగారం సింఘే వాలా-ఫుతుహివాలాకు చెందిన తర్సేమ్ సింగ్ అనే వ్యక్తికి చెందినదని జస్పాల్ సింగ్ తెలిపారు. శిథిలాల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!