Loksabha Election 2024: రేపు ఐదో దశ ఓటింగ్.. ప్రత్యేక విజ్ఞప్తి చేసిన ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఐదో దశ ఓటింగ్ జరుగనుంది. అందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. ఐదో విడత పోలింగ్కు ముందు ఓటర్లకు ఈసీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అభ్యర్థన చేసింది. ముంబై, థానే, లక్నో వంటి నగరాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల తేడా కనిపించిందని కమిషన్ చెబుతోంది.
Pavithra Naresh: అందుకే పవిత్రని ప్రేమించిన నరేష్.. ఇలా ఓపెన్ అయిపోయాడేంటి?
Also Read
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
ఇతర నగరాలతో పోలిస్తే మెట్రోపాలిటన్ నగరాల్లో రెండో దశలో కూడా ఓటింగ్ తక్కువగా నమోదైందని కమిషన్ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటింగ్కు ముందు పెద్ద నగరాల ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని, తక్కువ ఓటింగ్ శాతం ధోరణిని మార్చాలని కమిషన్ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. పట్టణ ఓటర్లలో ఓటింగ్ శాతాన్ని పరిష్కరించడానికి ఈసీ.. మెట్రో నగరాల కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించింది. గత నాలుగు దశల్లో ఇప్పటి వరకు 66.95 శాతం ఓటింగ్ జరిగినట్లు కమిషన్ వెల్లడించింది. ఇందులో దాదాపు 45.1 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 97 కోట్లు ఉన్నారు.
PM Modi: సోనియా గాంధీ రాయ్బరేలిని వదిలేసి, ఇప్పుడు కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారు..
నాలుగు దశల్లో జరిగిన ఓటింగ్లో ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. సోమవారం ఐదో దశ ఎన్నికల్లో బీహార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్తో సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఓటింగ్ జరగనుంది. ఈ సమయంలో 94,732 పోలింగ్ కేంద్రాల వద్ద 9.47 లక్షల మంది పోలింగ్ అధికారులను నియమించనున్నారు. ఐదో దశలో మొత్తం 8.95 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్ల మంది మహిళలు మరియు 5409 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!