Loksabha Election 2024: రేపు ఐదో దశ ఓటింగ్.. ప్రత్యేక విజ్ఞప్తి చేసిన ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఐదో దశ ఓటింగ్ జరుగనుంది. అందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. ఐదో విడత పోలింగ్కు ముందు ఓటర్లకు ఈసీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అభ్యర్థన చేసింది. ముంబై, థానే, లక్నో వంటి నగరాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల తేడా కనిపించిందని కమిషన్ చెబుతోంది.
Pavithra Naresh: అందుకే పవిత్రని ప్రేమించిన నరేష్.. ఇలా ఓపెన్ అయిపోయాడేంటి?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇతర నగరాలతో పోలిస్తే మెట్రోపాలిటన్ నగరాల్లో రెండో దశలో కూడా ఓటింగ్ తక్కువగా నమోదైందని కమిషన్ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటింగ్కు ముందు పెద్ద నగరాల ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని, తక్కువ ఓటింగ్ శాతం ధోరణిని మార్చాలని కమిషన్ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. పట్టణ ఓటర్లలో ఓటింగ్ శాతాన్ని పరిష్కరించడానికి ఈసీ.. మెట్రో నగరాల కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించింది. గత నాలుగు దశల్లో ఇప్పటి వరకు 66.95 శాతం ఓటింగ్ జరిగినట్లు కమిషన్ వెల్లడించింది. ఇందులో దాదాపు 45.1 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 97 కోట్లు ఉన్నారు.
PM Modi: సోనియా గాంధీ రాయ్బరేలిని వదిలేసి, ఇప్పుడు కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారు..
నాలుగు దశల్లో జరిగిన ఓటింగ్లో ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. సోమవారం ఐదో దశ ఎన్నికల్లో బీహార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్తో సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఓటింగ్ జరగనుంది. ఈ సమయంలో 94,732 పోలింగ్ కేంద్రాల వద్ద 9.47 లక్షల మంది పోలింగ్ అధికారులను నియమించనున్నారు. ఐదో దశలో మొత్తం 8.95 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్ల మంది మహిళలు మరియు 5409 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!