PM Modi: సోనియా గాంధీ రాయ్బరేలిని వదిలేసి, ఇప్పుడు కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సోనియాగాంధీ టార్గెట్గా ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్బరేలీని వదిలేసి, తన కొడుకు రాహుల్ గాంధీ కోసం సోనియాగాంధీ ఓట్లు అడుగుతున్నారని అన్నారు. కుటుంబ ఆధారిత పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంషెడ్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ ప్రచారానికి వెళ్లి, తన కొడుకును వారికి అప్పగిస్తున్నానని చెబుతున్నారని, రాయ్బరేలీలో ఎక్కువ కాలం పార్టీ తరుపున పనిచేసిన ఒక్క కార్యకర్త కనిపించలేదా..? అని ప్రధాని ప్రశ్నించారు.
సోనియా గాంధీ కోవిడ్ తర్వాత ఒక్కసారి కూడా తన నియోజకవర్గాన్ని సందర్శించలేదని, ఇప్పుడు తన కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. వారు రాయ్బరేలీని కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. శనివారం రాయ్బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సోనియాగాంధీ, తన కుమారుడు(రాహుల్ గాంధీ)ని రాయ్బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, అతడు మిమ్మల్ని నిరాశపరచడని ఆమె అన్నారు.
Also Read
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
Read Also: Janhvi Kapoor: 13 ఏళ్లకే పోర్న్ సైట్లో ఫోటోలు… నా ఫ్రెండ్స్ కూడా చూశారు… జాన్వీ కపూర్ ఎమోషనల్
మరోవైపు రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ యువరాజు వయనాడ్ నుంచి రాయ్బరేలీకి పారిపోయాడని, ఇది తన తల్లి సీటు అని అందరికీ చెబుతూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ‘‘8 ఏళ్ల పిల్లాడు చదువుకోవడానికి బడికి వెళ్లినప్పుడు కూడా తన నాన్న చదివిన బడి అయినప్పటికీ ఇది మా నాన్న బడి అని చెప్పడని, కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాన్ని తన పూర్వీకుల ఆస్తిగా భావిస్తోంది. జార్ఖండ్ అలాంటి కుటుంబ ఆధారిత పార్టీల నుంచి రక్షించబడింది’’అని ప్రధాని అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడతలో ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీలకు మే 20న ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ఈ స్థానాలను మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2004 నుంచి రాయ్బరేలీకి ఎంపీగా ఉన్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..