PM Modi: సోనియా గాంధీ రాయ్బరేలిని వదిలేసి, ఇప్పుడు కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సోనియాగాంధీ టార్గెట్గా ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్బరేలీని వదిలేసి, తన కొడుకు రాహుల్ గాంధీ కోసం సోనియాగాంధీ ఓట్లు అడుగుతున్నారని అన్నారు. కుటుంబ ఆధారిత పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంషెడ్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ ప్రచారానికి వెళ్లి, తన కొడుకును వారికి అప్పగిస్తున్నానని చెబుతున్నారని, రాయ్బరేలీలో ఎక్కువ కాలం పార్టీ తరుపున పనిచేసిన ఒక్క కార్యకర్త కనిపించలేదా..? అని ప్రధాని ప్రశ్నించారు.
సోనియా గాంధీ కోవిడ్ తర్వాత ఒక్కసారి కూడా తన నియోజకవర్గాన్ని సందర్శించలేదని, ఇప్పుడు తన కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. వారు రాయ్బరేలీని కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. శనివారం రాయ్బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సోనియాగాంధీ, తన కుమారుడు(రాహుల్ గాంధీ)ని రాయ్బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, అతడు మిమ్మల్ని నిరాశపరచడని ఆమె అన్నారు.
Also Read
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
Read Also: Janhvi Kapoor: 13 ఏళ్లకే పోర్న్ సైట్లో ఫోటోలు… నా ఫ్రెండ్స్ కూడా చూశారు… జాన్వీ కపూర్ ఎమోషనల్
మరోవైపు రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ యువరాజు వయనాడ్ నుంచి రాయ్బరేలీకి పారిపోయాడని, ఇది తన తల్లి సీటు అని అందరికీ చెబుతూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ‘‘8 ఏళ్ల పిల్లాడు చదువుకోవడానికి బడికి వెళ్లినప్పుడు కూడా తన నాన్న చదివిన బడి అయినప్పటికీ ఇది మా నాన్న బడి అని చెప్పడని, కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాన్ని తన పూర్వీకుల ఆస్తిగా భావిస్తోంది. జార్ఖండ్ అలాంటి కుటుంబ ఆధారిత పార్టీల నుంచి రక్షించబడింది’’అని ప్రధాని అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడతలో ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీలకు మే 20న ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ఈ స్థానాలను మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2004 నుంచి రాయ్బరేలీకి ఎంపీగా ఉన్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!