Farmers protest: నిరసన విరమించుకున్న కురుక్షేత్ర రైతులు.. డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers protest: హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి) డిమాండ్ను నెరవేర్చడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు మంగళవారం తమ నిరసనను ముగించారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన వెంటనే వారు సంబరాలు జరుపుకున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ పెద్దల సభలో ఆ రెండు ఖాళీల భర్తీ జరగదా.?
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
కురుక్షేత్రలో జిల్లా యంత్రాంగంతో చర్చల అనంతరం నిరసన విరమించామని బీకేయూ నాయకుడు రాకేష్ టికాయత్ తెలిపారు. అంతేకాకుండా నిరసన తెలిపిన రైతులకు పొద్దుతిరుగుడు పంటకు తగిన ధర కల్పిస్తామని హామీ ఇచ్చామని కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్ శంతను శర్మ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి పిప్లి సమీపంలోని జాతీయ రహదారి-44పై రైతులు మహాపంచాయతీ నిర్వహించి దిగ్బంధించారు. ఢిల్లీ-హర్యానా హైవేపై రైతులు నిరసన తెలిపారు. అయితే ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం రైతుల నిరసనలపై స్పందించడంతో రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also: Supreme Court: అవినాష్రెడ్డి బెయిల్ రద్దు విషయంలో కీలక పరిణామం..
కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మిన రైతులకు క్వింటాలుకు రూ.వెయ్యి చొప్పున పరిహారాన్ని భావంతర్ భార్పయ్ యోజన కింద హర్యానా ప్రభుత్వం ఇస్తున్నది. 36,414 ఎకరాల్లో సన్ఫ్లవర్స్ పండించిన 8,528 మంది రైతులకు రూ.29.13 కోట్ల పరిహారాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శనివారమే రిలీజ్ చేశారు. ఈ పరిహారంతో సంతృప్తి చెందని రైతులు ఆందోళన చేపట్టారు. పొద్దు తిరుగుడును ఎంఎస్పీతో క్వింటాలుకు రూ.6,400 చొప్పున కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
#WATCH | Farmers in Haryana's Kurukshetra end their protest and start celebrations after Government agrees to fulfil their demands.
Farmers were protesting over their demand for Minimum Support Price (MSP) on sunflower seeds. pic.twitter.com/FWKopOjj27
— ANI (@ANI) June 13, 2023
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!