Farmers protest: నిరసన విరమించుకున్న కురుక్షేత్ర రైతులు.. డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం..!
Farmers protest: హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి) డిమాండ్ను నెరవేర్చడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు మంగళవారం తమ నిరసనను ముగించారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన వెంటనే వారు సంబరాలు జరుపుకున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ పెద్దల సభలో ఆ రెండు ఖాళీల భర్తీ జరగదా.?
Also Read
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
కురుక్షేత్రలో జిల్లా యంత్రాంగంతో చర్చల అనంతరం నిరసన విరమించామని బీకేయూ నాయకుడు రాకేష్ టికాయత్ తెలిపారు. అంతేకాకుండా నిరసన తెలిపిన రైతులకు పొద్దుతిరుగుడు పంటకు తగిన ధర కల్పిస్తామని హామీ ఇచ్చామని కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్ శంతను శర్మ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి పిప్లి సమీపంలోని జాతీయ రహదారి-44పై రైతులు మహాపంచాయతీ నిర్వహించి దిగ్బంధించారు. ఢిల్లీ-హర్యానా హైవేపై రైతులు నిరసన తెలిపారు. అయితే ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం రైతుల నిరసనలపై స్పందించడంతో రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also: Supreme Court: అవినాష్రెడ్డి బెయిల్ రద్దు విషయంలో కీలక పరిణామం..
కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మిన రైతులకు క్వింటాలుకు రూ.వెయ్యి చొప్పున పరిహారాన్ని భావంతర్ భార్పయ్ యోజన కింద హర్యానా ప్రభుత్వం ఇస్తున్నది. 36,414 ఎకరాల్లో సన్ఫ్లవర్స్ పండించిన 8,528 మంది రైతులకు రూ.29.13 కోట్ల పరిహారాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శనివారమే రిలీజ్ చేశారు. ఈ పరిహారంతో సంతృప్తి చెందని రైతులు ఆందోళన చేపట్టారు. పొద్దు తిరుగుడును ఎంఎస్పీతో క్వింటాలుకు రూ.6,400 చొప్పున కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
#WATCH | Farmers in Haryana's Kurukshetra end their protest and start celebrations after Government agrees to fulfil their demands.
Farmers were protesting over their demand for Minimum Support Price (MSP) on sunflower seeds. pic.twitter.com/FWKopOjj27
— ANI (@ANI) June 13, 2023
తాజావార్తలు
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!