Farmers protest: నిరసన విరమించుకున్న కురుక్షేత్ర రైతులు.. డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers protest: హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి) డిమాండ్ను నెరవేర్చడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు మంగళవారం తమ నిరసనను ముగించారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన వెంటనే వారు సంబరాలు జరుపుకున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ పెద్దల సభలో ఆ రెండు ఖాళీల భర్తీ జరగదా.?
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
కురుక్షేత్రలో జిల్లా యంత్రాంగంతో చర్చల అనంతరం నిరసన విరమించామని బీకేయూ నాయకుడు రాకేష్ టికాయత్ తెలిపారు. అంతేకాకుండా నిరసన తెలిపిన రైతులకు పొద్దుతిరుగుడు పంటకు తగిన ధర కల్పిస్తామని హామీ ఇచ్చామని కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్ శంతను శర్మ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి పిప్లి సమీపంలోని జాతీయ రహదారి-44పై రైతులు మహాపంచాయతీ నిర్వహించి దిగ్బంధించారు. ఢిల్లీ-హర్యానా హైవేపై రైతులు నిరసన తెలిపారు. అయితే ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం రైతుల నిరసనలపై స్పందించడంతో రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also: Supreme Court: అవినాష్రెడ్డి బెయిల్ రద్దు విషయంలో కీలక పరిణామం..
కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మిన రైతులకు క్వింటాలుకు రూ.వెయ్యి చొప్పున పరిహారాన్ని భావంతర్ భార్పయ్ యోజన కింద హర్యానా ప్రభుత్వం ఇస్తున్నది. 36,414 ఎకరాల్లో సన్ఫ్లవర్స్ పండించిన 8,528 మంది రైతులకు రూ.29.13 కోట్ల పరిహారాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శనివారమే రిలీజ్ చేశారు. ఈ పరిహారంతో సంతృప్తి చెందని రైతులు ఆందోళన చేపట్టారు. పొద్దు తిరుగుడును ఎంఎస్పీతో క్వింటాలుకు రూ.6,400 చొప్పున కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
#WATCH | Farmers in Haryana's Kurukshetra end their protest and start celebrations after Government agrees to fulfil their demands.
Farmers were protesting over their demand for Minimum Support Price (MSP) on sunflower seeds. pic.twitter.com/FWKopOjj27
— ANI (@ANI) June 13, 2023
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!