Tanuku: ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్ చేసేందుకు యత్నం.. కట్చేస్తే..
- నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అయిదుగురు అరెస్టు
- తణుకు ఎస్బీఐ సీడీఎంలో జమ చేసేందుకు ప్రయత్నం
- రూ. 1.67 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం
- మీడియా సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్
- మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అయిదుగురు వ్యక్తులను తణుకు అరెస్టు చేశారు. తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సీడీఎం మెషీన్లో జమ చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉంది. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయమూర్తి, పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన జుత్తిగ నాగరాజు, యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన దిగుమర్తి ఏసు, బీమవరం మండలం యల్లమెల్లిపురం గ్రామానికి చెందిన తోట రామచంద్రరావు, తణుకు ఎన్జీవో కాలనీకు చెందిన పినిశెట్టి చక్రధర్లను
అరెస్టు చేసి వారి వద్ద 1,67,600 విలువైన 200 నోట్లు 838 స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ వెల్లడించారు.
READ MORE: MP CM Ramesh: “ఎంపీగా గ్రామానికి ఏం చేశావ్”.. సీఎం రమేష్, సీఎం సురేష్పై సొంత గ్రామస్థులు ఆగ్రహం..
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
తణుకు పట్టణంలోని ఎన్జీవో కాలనీకు చెందిన పినిశెట్టి చక్రధర్ గత నెల 15న స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సీడీఎం ద్వారా తన ఖాతాలోకి రూ. 200 నోట్లు మొత్తం రూ. 16,600 నగదును జమ చేశాడు. అయితే నగదు జమ కాకపోడంతో అదే నెల 21న బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజున బ్రాంచ్ మేనేజర్ విరోతి సోమశేఖర్తో కలిసి సిబ్బంది సీడీఎం మెషీన్ తెరచి చూడగా జమ చేసేందుకు ప్రయత్నించి 83 నోట్లు జమ కాకపోగా అక్కడే ఇరుక్కున్నాయి. దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా నకిలీ కరెన్సీ అని తేలడంతో తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై కె.ప్రసాద్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేపట్టారు.
READ MORE: IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
ఈ దర్యాప్తులో పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయులు గత 30 ఏళ్లుదదా నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 కేసుల్లో ముద్దాయిగా గుర్తించి అతని వద్ద నుంచి మిగిలినవారికి సరఫరా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆంజనేయులు తనకు బృందంగా ఏర్పాటు చేసుకున్న జుత్తిగ నాగరాజు, దిగుమర్తి ఏసు, తోట రామచంద్రరావు, పినిశెట్టి చక్రధర్లతో నకిలీ కరెన్సీ చలామణి చేయిస్తున్నట్లుగా నిర్థారించారు. వీరితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉండగా వీరు వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు డీఎస్పీ విశ్వనాథ్ వివరించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!