Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anantapur Faje Document Mafia Gang Busted In Anantapur

Fake Documents Mafia: 40 ఎకరాలు.. ఐదు కోట్లు..నకిలీ డాక్యుమెంట్ల మాఫియా గుట్టురట్టు

Published Date :January 26, 2023 , 10:10 pm
By NTV WebDesk
Fake Documents Mafia: 40 ఎకరాలు.. ఐదు కోట్లు..నకిలీ డాక్యుమెంట్ల మాఫియా గుట్టురట్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఖాళీగా ఖరీదైన భూమి కనిపిస్తే చాలు మాఫియా రెచ్చిపోతుంది. అనంతపురం జిల్లాలో 5కోట్లు విలువ చేసే 40 ఎకరాలు భూమిని కొట్టేయడానికి కేటుగాళ్ళు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. భూ యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన మరీ కోర్టు ద్వారా డైరెక్షన్ భూములు రిజిస్ట్రేషన్ ప్రయత్నాలు ఫలించలేదు.ఏకంగా మృతి చెందిన భూ యజమానులు అమ్మినట్టు,అప్పులు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు తెచ్చారు. ఇక్కడే వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా పోరాటం చివరికి జిల్లా ఎస్పీ చొరవ నకిలీ పత్రలు గుట్టు రట్టు చేశారు పోలీసులు. జిల్లా ఇటీవల బుక్కరాయసముధ్రం,కుడేరు,అనంతపురం రూరల్ పరిధిలో ఈ నకిలీ భూ పత్రాలు,అమ్మకాలు బయట పడ్డాయి.తాజాగా విడపనకల్లు మండలం లోని గడేకల్ గ్రామంలో వేలుగు చూసింది.

Read Also: Ongole Republic Day: కలెక్టర్ హైటీ కి ప్రజాప్రతినిధుల డుమ్మా!

ఉరవకొండ రూరల్ సిఐ శేఖర్ వెల్లడించిన వివరాల మేరకు విడపనకల్లు గడేకల్ గ్రామానికి చెందిన గుండాల.నారాయణప్పకి గ్రామంలో40 ఎకరాల భూమి ఉంది.ఆయనకి నలుగురు కూతుళ్లు కావడంతో సమీప బంధువులోని ఒకరు సీతారాముడు ఆభూమి మీద కన్ను పడింది.30-10-2016 న నారాయణప్ప చనిపోవడంతో తన దగ్గర 5లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడని అందుకు7 ఎకరాలు భూమి అగ్రిమెంట్ రాసుకున్నట్టు కోర్టుని ఆశ్రయించారు సీతారాముడు,ఈవిషయం కుటుంబ సభ్యులు నా నలుగురు కూతుళ్ళ తెలియకుండా కోర్ట్ డైరెక్షన్ లో ఆభూమిని రిజిస్ట్రేషన్ కోసం వెళ్లడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వారు చెబుతున్న అప్పు, రిజిస్ట్రేషన్ పత్రాలలోని సంతకాలు తమ తండ్రి నారాయణప్పవి కావని చిన్న కూతురు సరితా శైలజ అనుమానం వ్యక్తం చేశారు. అందుకు బ్యాంకు,గ్యాస్, దేనా బ్యాంకు లో వారి తండ్రి బతికుండగా చేసిన సంతకాలు సేకరించి గుత్తి కోర్టు లో దాఖలు చేయడంతో సీతారాముడు అక్రమ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దీంతో సీతారాముడుకు తోడుగా అదేగ్రామానికి చెందిన జె. నారాయణ తో కలిసి మరో కంత్రీ ప్లాన్ చేశారు. మృతి చెందిన నారాయణప్ప భార్య వెంకట లక్ష్మీ తమకు భూముల అమ్మకానికి సంబంధించిన అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్టు మరో నకిలీ పత్రాలు సృష్టించారు. అందులో బళ్లారి కి చెందిన రంగనాథ్,లోకేష్, కూడా 7.5 ఎకరాలు ను 9.57 లక్షల కు రంగనాథ్ కొన్నట్టు,7.22ఎకరాలు ను లోకేష్ 17.22 లక్షలకు కొన్నట్టు నకిలీ పత్రాలు సృష్టించారు.

అందుకు అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర పత్రాలు రాసే హామీదా భాను,ఆమె భర్త కలిసి నకిలీ 100 రూపాయల బ్రాండ్లు తీసుకున్నారు. అవి కూడా నాసిక్ లో తయారీ సంస్థ తేదీన 2018 ఏప్రిల్2 కాగా నవంబర్24,2018 కు అనంతపురం రిజిస్ట్రేషన్ ఆఫీసు వచ్చాయి .తయారీ తేదీ రోజే 21 ఏకరాలు భూమికి వేరు వేరుగా రిజిస్ట్రేషన్ పత్రాలు అగ్రిమెంట్ రాసుకోవడం వెలుగులోకి వచ్చాయి. చిన్న కూతురు శైలజ ఆర్టీఐ సమాచారం ద్వారా వీటిని సేకరించారు. దీంతో నకిలీ కొనుగోలు, అగ్రిమెంట్ పై వివరాలతో ఈ నేల 23-01-2023,న నలుగురు కూతుళ్లు జిల్లా ఎస్పీ పక్కిరప్ప కలిసి ఫిర్యాదు చేసారు. ఎస్పీ ఉరవకొండ సిఐ శేఖర్ ను విచారణ ఆదేశించారు. విచారణలో చివరకు బీమా డబ్బులు కోసం మృతి చెందిన వెంకటలక్ష్మి బ్రతికుండగానే డబ్బులు బళ్ళారి లోని కోటక్ బ్యాంక్ నుంచి తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎనిమిదిమందిపై కేసు నమోదు కాగా వారిలో ఇద్దరు సీతారాముడు, జె. నారాయణ అరెస్టు చేశారు. మిగిలిన 6 మంది కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read Also: Kangana Ranaut: నా జీవితం నాశనమైనా.. తిరిగి నిలబడే సత్తా ఉంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 4 Crores value land
  • Agreements
  • Anantapur
  • ap
  • ap police

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions