Merugu Nagarjuna: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది..
- కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారింది- మాజీ మంత్రి మేరుగ నాగార్జున
- దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారు- మేరుగ నాగార్జున
- పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు- మేరుగ నాగార్జున
- ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది- మేరుగ నాగార్జున.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారని అన్నారు. అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు.. చంద్రబాబు వైఖరి వలనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని మేరుగ నాగార్జున తెలిపారు. ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు..? అని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు.. చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా, మెదిలినా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.
Read Also: IND vs BAN: వర్షం లేకపోయినా.. మూడో రోజు ఆట రద్దు!
Also Read
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
ఏకంగా సీఎం చంద్రబాబే మక్కెలు విరగ్గొడతానంటూ మాట్లాడటం దేనికి సంకేతం?.. మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలకు ఎవరు బాధ్యులు? అని మేరుగ నాగార్జున అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దాడులు చేయటానికి చంద్రబాబు లైసెన్సులు ఇచ్చేశారు.. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారశైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారు.. తనను వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని దుయ్యబట్టారు. కాకినాడలో ప్రొఫెసర్ మీద ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రశ్నించారు. ఇంకో ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తొలిగిస్తే ఏం చర్యలు తీసుకున్నారు..? అఖిలప్రియ దాడులకు పాల్పడితే ఏం చేశారు?.. కోట్ల సూర్యప్రకాషరెడ్డి వాల్మీకి కులస్తులపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు?.. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచకాలపై ఏం చర్యలు తీసుకున్నారు?.. ఇన్ని దారుణాలు మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?.. ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేరుగ నాగార్జున తెలిపారు.
Read Also: Tirumala Laddu: టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ
తాజావార్తలు
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!