EVMs Trouble: ఏపీలో పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు.. నిలిచిపోయిన పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దీసేపటికే ఈవీఎంలు పెద్ద ఎత్తున మొరాయిస్తున్నాయి. దీంత ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమైయ్యారు. వాటిలోని సమస్యను పరిష్కరించేందుకు టెక్నిషన్స్ ను రంగంలోకి దించింది. కాగా, ప్రకాశం జిల్లాలోని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 138, 140వ పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. దీంతో పాటు చీమకుర్తి 23వ పోలింగ్ కేంద్రంలో పనిచేయని లోక్ సభ ఈవీఎం నిలిచిపోయిన పోలింగ్ ప్రక్రియ.. ఓటు వేసేందుకు భారీగా ఓటర్లు రావడంతో ఈవీఎంలు మొరాయించడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, నెల్లూరు జిల్లాలోని కందుకూరు మండలం కంచరగుంటలో 160 పోలింగ్ బూత్ లోను ఈవీఎం మోరాయించింది. దీంతో పాటు వరదయ్యపాలెం మండల కేంద్రంలో బూత్ నెంబర్ 64, బూత్ నెంబర్ 65, జడ్పీ హైస్కూల్లోని 89వ పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎంలో సాంకేతిక లోపంతో ఇప్పటి వరకు పోలిగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈవీఎంలను ఎన్నికల అధికారులు సరి చేస్తున్నారు.
Read Also: Jr NTR: ఓటు వేసేందుకు కుటుంబంతో వచ్చిన ఎన్టీఆర్!
Also Read
- Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ 'గట్ ఫీల్' గురించే అంటూ వ్యాఖ్యలు..
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
అలాగే, శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలోని 102 పోలింగ్ కేంద్రంలో లోక్ సభ స్థానానికి సంబంధించిన ఈవీఎం పని చేయడం లేదు. ఇక, గన్నవరం, పెనమలూరు, జగ్గయ్యపేటలో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. ఈవీఎంలలో ఇబ్బందితో గన్నవరం, పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్దులు యార్లగడ్డ వెంకట్రావ్, బోడే ప్రసాద్ లు ఓటు వేయటానికి వచ్చి నిరీక్షిస్తున్నారు. అలాగే, జగ్గయ్యపేటలోనూ ఈవీఎంలలో సాంకేతిక లోపంతో ఇప్పటి వరకు పోలింగ్ ప్రారంభంకాలేదు. దీంతో పాటు నగరి నియోజక వర్గంలోని సీతారామపుర బూత్ లో ఈవీఎం మొరాయించింది. రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ అధికారులు సరి చేస్తున్నారు.
Read Also: Elections 2024 : బెంగాల్లో ఓటింగ్ ముందు చెలరేగిన హింస… టీఎంసీ కార్యకర్త హత్య
అయితే, అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని 112 బూత్ లో ఈవీఎం మొరాంచడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. తాడిపత్రి పట్టణంలోని 251 పోలింగ్ కేంద్రంలో ఎంపీకి సంబంధించిన ఈవీఎం సైతం పని చేయడం లేదు. యల్లనూరు మండలం వెన్నపూస పల్లి గ్రామంలోనూ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అలాగే, నంద్యాల జిల్లాలోని అవుకు మండలం రామవరంలో మొరాయించిన ఈవీయం, 7 గంటలు దాటినా కూడా పూర్తి కానీ, మాక్ పోలింగ్, మరో అరగంట పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?