Etala Rajender: 25 నుండి 30 సీట్లు బీజేపీకి వస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలింగ్ ముగిసిన అనంతరం.. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ద్వేషం ఉందో గజ్వేల్ లో తిరిగితే అర్థం అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేది వేరు చేసేది వేరు.. నియంత లాగా వ్యవహారం చేశారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడానికి బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఓటు వేశారని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం, యువత, మహిళలు మార్పు రావాలి.. ఆ మార్పు బీజేపీకి రావాలి అని కోరుకున్నారని ఈటల పేర్కొ్న్నారు.
Nayanthara: నయనతారకు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ధర ఎంతో తెలుసా?
Also Read
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
- Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చాడని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు.. ఇవాళ ప్రజల సత్తా చూపారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి మేధావులు సహకారం ఇచ్చారని పేర్కొన్నారు. ఉన్నంతలో ధర్మం కాపాడగలిగామని ఈటల చెప్పారు. హుజురాబాద్ లో 2021లోనే కేసీఆర్ డబ్బు సంచులను ఎదుర్కొన్నాం.. నిలబడ్డామన్నారు. ఇప్పుడు కూడా మద్యం, డబ్బులు పంచే పని చేశారన్నారు. హుజురాబాద్ ప్రజలు తన బిడ్డ ఈటల అని గెలిపించబోతున్నారని తెలిపారు. గజ్వేల్ లో తక్కువ కాలంలోనే బాగా పని చేశారు.. కేసీఆర్ ని ఓడించగలవు అని చెప్పారన్నారు. బీజేపీ కార్యకర్తలతో పాటు అనేక మంది నాయకులు పని చేశారని ఈటల తెలిపారు. కేసీఆర్ బాధితులు అంతా తనను ఆదరించారని.. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా పని చేశారని పేర్కొన్నారు.
Tejas Fighter Jets: మరో 97 తేజస్ ఫైటర్ జెట్లు.. భారీ రక్షణ ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం
గజ్వేల్ గడ్డ పై బీజేపీ గెలుస్తుందని.. కేసీఆర్ ని ఓడించే సత్తా గజ్వేల్ ప్రజలకే ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. కురుక్షేత్ర యుద్ధంలో సర్వే సంస్థలకు కూడా అంతుబట్టని ఫలితం గజ్వేల్ లో వస్తుందన్నారు. గజ్వేల్ లో గెలుస్తున్నా.. ఎక్కువ మెజారిటీతోనా, తక్కువనో కానీ గెలుస్తున్నా అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. కేసీఆర్ హుజురాబాద్ ప్రజలకు ఒక సైకోని ఇచ్చారని దుయ్యబట్టారు. దానికి కారణం కేసీఆర్ అని విమర్శించారు. తీర్పు వచ్చిన తర్వాత అయినా సమాధానం చెప్పాలని తెలిపారు. కేసీఆర్ నా కొడుకు లాంటి వాడు అన్నాడు.. కేసీఆర్ తీరు ఏందో కూడా రేపు బయట పడుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. 25 నుండి 30 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పారు. సంకీర్ణాల రాజకీయాల్లో ఏమైతదో చూడాలి.. బీఆర్ఎస్ తో కలిసేది లేదని అన్నారు.
- Tags
- bjp
- BRS
- Etala Rajender
- kcr
- telugu news
తాజావార్తలు
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?