BJP: ఈశ్వరప్పపై బీజేపీ కొరడా.. ఆరేళ్లు బహిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీలో కొందరు సీనియర్లకు ఈసారి సీట్లు దక్కలేదు. దీంతో అగ్ర నేతలు అకలబూనారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సదానందగౌడ్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప.. బీజేపీకి తలనొప్పిగా మారారు. దీంతో ఆయన్న పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేశారు.
ఇది కూడా చదవండి: AP BJP: ఏపీకి రేపు కేంద్ర మంత్రుల రాక
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
తన కుమారుడు కాంతేశ్కు హవేరీ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఈశ్వరప్ప అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పార్టీపై తిరుగుబావుటా ఎగరేశారు. గతంలో ప్రకటించిన రాజకీయ రిటైర్మెంట్ను పక్కనపెట్టి మరీ శివమొగ్గ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో ఆయన వ్యవహార శైలిని పార్టీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకుగానూ ఈశ్వరప్పను ఆరేళ్ల పాటు బీజేపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: MI vs RR: 5 వికెట్లతో చెలరేగిన సందీప్ శర్మ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?
శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఎస్ ఈశ్వరప్ప ఐదుసార్లు విజయం సాధించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ దక్కేలా చేస్తానని మాట ఇచ్చి మోసగించారంటూ మాజీ సీఎం యడియూరప్పపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం శివమొగ్గ నుంచి బీజేపీ తరఫున యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర పోటీలో ఉన్నారు. టికెట్ రాకపోవడానికి యడియూరప్పనే కారణమని ఆరోపిస్తూ.. తండ్రీకుమారుల నియంత్రణ నుంచి పార్టీకి విముక్తి కల్పించేందుకే తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి బుజ్జగించినా.. ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే అధిష్ఠానం ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.

శివమొగ్గ ఎన్నికల పోలింగ్ మే 7న జరగనుంది. ఏప్రిల్ 12న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఇక్కడ 23 మంది బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ పత్రాల ఉపసంహరణకు చివరి రోజు. కానీ ఈశ్వరప్ప ఉపసహరించుకోలేదు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసింది. బీజేపీ నుంచి బీవై రాఘవేంద్ర, కాంగ్రెస్ నుంచి గీతా శివరాజ్కుమార్, కర్ణాటక రాష్ట్ర సమితి నుంచి ఎస్కే ప్రభు, ఉత్తమ ప్రజాకీయ పార్టీకి చెందిన అరుణ కనహళ్లి, యంగ్ స్టార్ ఎంపవర్మెంట్ పార్టీకి చెందిన మహ్మద్ యూసుఫ్ ఖాన్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏడీ శివప్ప బరిలో ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థులు కెఎస్ ఈశ్వరప్ప, జి జయదేవ్, ఇహెచ్ నాయక్, చంద్రశేఖర్ హెచ్సి, బండి, సందేశ్ శెట్టి ఎ, డిఎస్ ఈశ్వరప్ప, పి శ్రీపతి భట్, ఇంతియాజ్ అత్తార్, రవి కుమార్ ఎన్, పూజ ఎన్ అన్నయ్య, సురేష్ పూజారి, శివరుద్రయ్య స్వామి, జాన్ బెన్నీ, గణేష్ బి ., కునాజే మంజునాథ గౌడ, NV నవీన్ కుమార్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu: ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..