AP BJP: ఏపీకి రేపు కేంద్ర మంత్రుల రాక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BJP: రాష్ట్రంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. మంగళవారం నుంచి నామినేషన్లు ప్రారంభించనుంది. రేపటి నామినేషన్లకు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతున్నట్లు ఏపీ బీజేపీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించనున్నారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జి అరుణ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొంటారు.
READ MORE: Congress: ప్రధాని మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ యాదవ్ అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కు కేంద్ర మంత్రి వికే సింగ్ హాజరు కానున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కైకలూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనుండగా.. అక్కడికి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రానున్నారు. మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణు కుమార్ రాజు విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనుండగా.. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
Also Read
తాజావార్తలు
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..