Twitter Poll: ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా?.. పోల్ ఏర్పాటు చేసిన మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter Poll: ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాడు. జీవితకాల నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అనే దానిపై ఓటు వేయాలని మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వినియోగదారులను కోరుతూ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఒక పోల్ను ఏర్పాటు చేశారు. 5 గంటల క్రితం ప్రారంభించిన ఈ పోల్ లో ఇప్పటివరకు 55 శాతం మంది పునరుద్ధరించాలని 45 శాతం మంది వద్దని ఓటు వేశారు. ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న ఈ పోల్ లో ఇప్పటికే దాదాపు 55 లక్షల మంది పాల్గొన్నారు. ఈ పోల్ 24 గంటల పాటు జరుగుతుంది. ఈ పోల్ నిర్వహించే ముందు ఎలాన్ మస్క్ మరో ట్వీట్ చేశారు. ‘‘ప్రజల గళమే దేవుడి గళం’’ అని పేర్కొన్నారు. ఇటీవలే ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత గత ఏడాది జనవరి 6న కాపిటల్ భవనంపై దాడి జరగడంతో ఆ తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Manika Batra: మనిక బాత్రా రికార్డు.. ఆసియా కప్ టీటీ ఈవెంట్లో కాంస్యం
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
2020లో యూఎస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత జనవరి 6న క్యాపిటల్ హిల్లో జరిగిన తిరుగుబాటు నేపథ్యంలో ట్రంప్ ఖాతా సస్పెండ్ చేయబడింది. దీని ఫలితంగా మాజీ యూఎస్ అధ్యక్షుడికి చట్టపరమైన సమస్యలు వచ్చాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ట్విట్టర్ను కొనుగోలు చేయడంతో సహా ఈ పద్ధతిలో అనేక నిర్ణయాలు తీసుకున్నందున ఈ కొత్త విధానం ఆశ్చర్యం కలిగించదు. మస్క్ ట్విట్టర్ ప్లాట్ఫాం నియమాలను ఉల్లంఘించినందుకు గతంలో నిరవధిక నిషేధాలకు లోబడి ఉన్న ఖాతాలను పునరుద్ధరించడం ప్రారంభించాడు. ఖాతాలు పునరుద్ధరించబడిన మొదటి వ్యక్తులలో రచయిత జోర్డాన్ పీటర్సన్, హాస్యనటుడు కాథీ గ్రిఫిన్ ఉన్నారు.
తాజావార్తలు
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!