Elon Musk: అందరికీ తెలిస్తే ఆయన ఎలాన్ మస్క్ ఎలా అవుతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేతగా ఎలాన్ మస్క్ ప్రపంచంలో చాలా కొద్ది మందికే పరిచయం. ఎప్పుడైతే ట్విటర్ కొనుగోలు చేశాడో సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలోని చివరి మనిషి వరకు ఆయన పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. ట్విటర్ పగ్గాలు చేపట్టిన తొలి రోజే ఆయన ఆ కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించారు. ఇప్పటి వరకు కొత్త సీఈవోను ప్రకటించలేదు. సీఈవోతో పాటు పలువురు కంపెనీ ప్రముఖులను తొలగిచడం సంచలనంగా మారింది. అంతే కాకుండా కంపెనీ ఖర్చు తగ్గించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఆ క్రమంలోనే పనితీరు బాగోలేని ఉద్యోగులను తొలగించాలని.. అందుకు కొందరి పేర్లు సూచించాలని మేనేజర్లకు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో ట్విట్టర్ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
Read Also: Satyadev Kancharana: సత్యదేవ్ పారితోషికం రెట్టింపు
Also Read
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
- AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
- Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
మరోవైపు ట్విట్టర్ మస్క్ మార్క్ భారీ మార్పులు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన ఆలోచనలు ఎవరికీ అర్థం కావడం లేదంటూ అనుకుంటున్నారు. ట్విట్టర్ కొత్త సీఈవో ఎవరో ప్రస్తుతానికి తనకు కూడా తెలియదని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. కానీ, పరాగ్ అగర్వాల్ తదితరులను తొలగిస్తూ ఆయన సైన్ చేసిన ఎస్ ఈసీ పత్రం మాత్రం వేరే కథ వెల్లడిస్తుంది. అది ఎలాన్ మస్క్ను ట్విట్టర్ కొత్త సీఈవోగా చూపిస్తోంది.
Read Also: Hardeep Singh Puri: రష్యా నుంచి ఆయిల్ కొంటాం.. పాశ్చాత్య మీడియాకు కేంద్రమంత్రి దిమ్మతిరిగే సమాధానం
కంపెనీ పగ్గాల చేపట్టిన మస్క్.. పరాగ్, లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ఓ నెల్ సెగల్ పై వేటు వేశారు. ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లను తొలగించిన తర్వాత మస్క్ ట్విట్టర్ బోర్డును రద్దు చేసి, కంపెనీకి ఏకైక డైరెక్టర్ అయ్యారు. అయితే, ఈ మార్పులు తాత్కాలికమే అని ఎలాన్ మస్క్ అంటున్నారు. ఈ లెక్కన ఆయన ట్విట్టర్ డైరెక్టర్ గా కూడా ఉండబోరని తెలుస్తోంది. అలాగే, సంస్థకు త్వరలోనే బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ట్విట్టర్ లో ప్రస్తుతం 7500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మస్క్ 75 శాతం సిబ్బందిని తొలగిస్తారన్న వార్తలను మస్క్ ఖండించారు.
తాజావార్తలు
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
-
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!