Twitter: ట్విట్టర్ యూజర్లకు మస్క్ బంపరాఫర్.. ఇలా సంపాదించుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter: ఎలాన్ మస్క్ ఎంట్రీ తర్వాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి అనేక మంది ఉన్నతాధికారులను, ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.. బ్లూటిక్కు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు.. అంతేకాదు.. ట్విట్టర్ యూజర్లు అందరికీ ఆయన షాకిచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది.. ఇక, ట్విట్టర్ లోగాలోనూ మార్చులు జరిగాయి.. అయితే, బిజినెస్ ఎలా చేయాలనే దానిపై ఓ స్పష్టమైన అవగాహన ఉన్న మస్క్.. ఇప్పుడు ట్విట్టర్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించారు.. తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం యూజర్లకు కల్పిస్తున్నట్టు ప్రకటించారు.
ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించుకునే పనిలోపడిపోయిన ఎలాన్ మస్క్.. యూజర్లకు ఆ అవకాశం ఎలా? ఇస్తారు అనే విషయాల్లోకి వెళ్తే.. ఏదైనా ఎక్కువ సమాచారం నుంచి ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు దేనికైనా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తో డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు.. దీని కోసం సెట్టింగ్స్లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే సరిపోతుందని వివరించారు.. అయితే, ఈ ఆప్షన్ ప్రస్తుతానికి అమెరికా లాంటి దేశాల్లో అందుబాటులో ఉండగా.. భారత్లో మాత్రం ఇంకా ప్రారంభించలేదు.. మరికొన్ని రోజుల్లో అన్ని దేశాలకు ఈ ఆప్షన్ విస్తరింపజేసే పనిలో పడిపోయింది ట్విట్టర్… ఇక, మొదటి 12 నెలల పాటు, సబ్స్క్రిప్షన్ల ద్వారా వినియోగదారులు సంపాదించే డబ్బులో ట్విట్టర్ ఎలాంటి మొత్తాన్ని తీసుకోదట.. అంటే సబ్స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే ఇస్తారు.. కానీ, ట్విటర్ ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్ 30 శాతం యాప్ స్టోర్ ఫీజు వసూలు చేయనున్నాయి.. అంతే కాకుండా తమ కంటెంట్ ప్రమోట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.. ట్విట్టర్ ఇటీవల తన ప్లాట్ఫారమ్తో డబ్బు ఆర్జించే ప్రయత్నాలతో పోరాడుతోంది. ఇప్పుడు వినియోగదారులు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించారు.
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రకారం, “లాంగ్ఫార్మ్ టెక్స్ట్ నుండి గంటల నిడివి గల వీడియో వరకు” వారి కంటెంట్కు యాక్సెస్ కోసం ఛార్జ్ చేయడానికి ట్విట్టర్ వినియోగదారులను అనుమతిస్తుంది. మస్క్ ప్రజలు తమ ట్విట్టర్ ఖాతాల నుండి డబ్బు సంపాదించడం సాధ్యమయ్యేలా చేయడానికి న్యూస్లెటర్ కంపెనీ అయిన సబ్స్టాక్తో పోటీ పడుతోంది. ఇంతలో, సబ్స్టాక్ ట్విట్టర్ను పోలి ఉండటం ప్రారంభించింది. సైట్ ఇటీవల గమనికలను పరిచయం చేసింది, ఇది వినియోగదారులను పబ్లిక్ ఫీడ్లో పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ వారం ప్రారంభంలో ఒక ట్వీట్లో సబ్స్టాక్ లింక్ ఉంటే Twitter ఇష్టాలు, ప్రత్యుత్తరాలు మరియు రీట్వీట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్లాట్ఫారమ్లో చోటుచేసుకుంటున్న మార్పులు.. ఎక్కువ మంది కంటెంట్ సృష్టికర్తలను ప్రలోభపెట్టవచ్చు లేదా వారిని విడిచిపెట్టకుండా నిరోధించవచ్చు అని అంచనా వేస్తున్నారు.. ట్విట్టర్ మొదటి సంవత్సరం వినియోగదారుల సబ్స్క్రిప్షన్ రాబడిలో కోత తీసుకోనప్పటికీ, భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని సంపాదించడానికి ఇది ఒక చర్య కావచ్చు అంటున్నారు.
Apply to offer your followers subscriptions of any material, from longform text to hours long video!
Just tap on “Monetization” in settings.
— Elon Musk (@elonmusk) April 13, 2023
తాజావార్తలు
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!