Ronald Rose: హైదరాబాద్లో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.. కౌంటింగ్కు అంతా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో.. శనివారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు. అనంతరం అంబర్ పేట్ జీహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మలక్ పేట్ కౌంటింగ్ సెంటర్, ప్రొ.జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కౌంటింగ్ సెంటర్, దోమలగూడ ఏ.వి కాలేజ్ లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్ కౌంటింగ్ సెంటర్, నారాయణగూడ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ (జి.ఎఫ్ అండ్ ఓపెన్ గ్రౌండ్) ఏర్పాటు చేసిన అంబర్ పేట్ కౌంటింగ్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు. అనంతరం.. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఏర్పాటు చేసిన సనత్ నగర్ కౌంటింగ్ సెంటర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యాతో కలిసి ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
Actress Subbalakshmi: సీనియర్ నటి సుబ్బలక్ష్మి చివరి క్షణాలు.. వీడియో షేర్ చేసిన మనవరాలు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… కౌంటింగ్ సెంటర్ లోకి ఎవ్వరికీ సెల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. ఏజెంట్లు, కౌంటింగ్ నియమించిన సిబ్బంది అందరూ ఉదయం 5 గంటల వరకు కౌంటింగ్ సెంటర్ కు రావాలని తెలిపారు. కౌంటింగ్ కు 14 టేబుల్ ఏర్పాటు చేయగా.. మూడంచెల బందోబస్తు, మొదటి దశలో సివిల్ పోలీస్, రెండవ దశలో స్టేట్ ఆర్మీ పోలీస్, మూడవ దశలో కేంద్ర బలగాలు ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఉదయం 9 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. ఉదయం 9:30 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు ముగుస్తుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఒక్కో నియోజకవర్గానికి ఒక సాధారణ పరిశీలకులను నియమించిందని, సాధారణ పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని రోనాల్డ్ రోస్ తెలిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!