Delhi Liquor Case: ఆప్, కేజ్రీవాల్పై ఈడీ చార్జీషీట్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్తో పాటు పార్టీని కూడా ఛార్జీషీటులో చేర్చింది. ఒక జాతీయ పార్టీని ఛార్జీషీటులో దాఖలు చేయడం ఇదే తొలిసారి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ.. గోవా ఎన్నికల్లో రూ.45 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంది. ఈ ఛార్జీషీటులో మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ను సూత్రదారులుగా చేర్చింది.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఆ క్రమంలో ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. అంతకుముందు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సింఘ్వీ తన వాదనలు వినిపించారు.
Also Read
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
అయితే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలున్నాయని.. ఈ నేపథ్యంలో ట్రయిల్ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. ఇక ఈ వ్యవహారంలో కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చర్చలు నడిచాయని పేర్కొంది. ఆ క్రమంలో హవాలా ఆపరేటర్లు.. వారి ఫోన్లను ధ్వంసం చేశారని సోలిసిటర్ జనరల్ ఈ సందర్బంగా కోర్టుకు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు.
తాజాగా ఆయన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. జూన్ 2న తిరిగి సరెండ్ అవ్వాలి.
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!