Drunken Drive : మూడు నెలల్లో భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు.. వివరాలు వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు
- గడిచిన మూడు నెలలో ట్రాఫిక్ పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ వివరాలు
- మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు
- గడిచిన 3 నెలల్లో 13,933 మంది వాహనదారులపై కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunken Drive : మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదకరమైన చర్య. మద్యం మనం కళ్లతో చూస్తున్నదానిపై కూడా ప్రభావం చూపుతుంది, మన మస్తిష్కాన్ని, నాడీ వ్యవస్థను క్రమంగా ప్రభావితం చేస్తుంది. ఇది మన అవగాహనను తగ్గించి, మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అందుకే.. మద్యం సేవించి వాహనాన్ని నడపవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొందరు పట్టించుకోకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలుగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ వివరాలను హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం విడుదల చేసింది.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది ట్రాఫిక్ విభాగం. గడిచిన 3 నెలలు ఆగస్టు 24 నుంచి నవంబర్ 21 వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 13,933 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
వివిధ కోర్టుల్లో 13,188 చార్జిషీట్లు దాఖలు చేసినట్లు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 52,080 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత 3 నెలల్లో 824 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి 1 నుంచి 10 రోజుల వరకు జైలు శిక్ష, 2 రోజుల పాటు 227 మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి సామాజిక సేవ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించినట్లు తెలిపారు. RTO ద్వారా 99 డ్రైవింగ్ లైసెన్స్లను 2 నుండి 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై 2,87,20,600/- జరిమానా విధించినట్లు, 09.11.2024న మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు స్పెషల్ డ్రైవ్లో 327 మంది డ్రంక్ డ్రైవర్లను పట్టుకుని, వారిపై U/s 185 of M.V. చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఒక్క రోజులో 44 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి 04-10-2024 నాడు గరిష్టంగా 4 రోజులు, కనిష్టంగా 2 రోజులు శిక్ష విధించి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 44 మంది జైలుకు పంపబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్లు సస్పెండ్ చేయబడ్డాయని, గత 3 నెలల్లో పట్టుబడిన డ్రైవర్లలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు 11,904 (85%) పట్టుబడినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
Priyanka Gandhi: ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..