Madhusudan : ఇది కేవలం కుట్రపూరిత రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జడ్చర్ల బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ డా. మధుసూదన్ నిరాశతో శంషాబాద్ లోని తన నివాసంలో విలేకరులు సమావేశాన్ని నిర్వహించారు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకొని చాలా బాధపడ్డారు. గతంలో ఎన్నడు లేని విధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా గుర్తింపు లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వడం ఎంతో బాధాకరంగా ఉందని ఆయన దిగమింగుకొని పార్టీలోనే కొనసాగి రెబల్గా నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. ఇది కేవలం కుట్రపూరిత రాజకీయంగా అభివర్ణిస్తూ కేంద్రంలో ఉన్న పెద్ద నేతలు గ్రహించవలసిందిగా ఆయన గుర్తు చేశారు.
బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు కేంద్రం అనువైన వారికి కాకుండా రాష్ట్రంలో పలుకుబడి లేని పారాషూట్ తో అప్పటికప్పుడు వాలిపోయిన వ్యక్తులకి గుర్తింపు లేని ప్రజాధరణ లేని నాయకులని ఈటల రాజేందర్ ఆదరించడం సబబు కాదని ఆయన బాధపడ్డారు. కేవలం కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి పార్టీలో క్యాడర్ జనాధరణ లేని ఎలాంటి సుమిచితం లేని వ్యక్తులని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నుకోవడం వారి ఇస్తారాజ్యంగా నాయకులని ఎన్నుకోవడం వల్ల బీజేపీకి ఉన్న ప్రజాధరణ కోల్పోవడమే కాకుండా రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీ కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందని ఆయన కేంద్ర నాయకులకి విజ్ఞప్తి చేశారు.
Also Read
రాష్ట్రంలో సీట్ల కేటాయింపు కేవలం ఒక బూటకంగా మారిందని అందులో 119 అభ్యర్థుల కేటాయింపులో అలసత్వం లోనవుతుందని ఆయన నామినేషన్ వేయడానికి ప్రధాన కారణంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అనుభవం లేని వ్యక్తులకు సీట్ల కేటాయింపులో బాధ్యతలు అప్పజెప్పడం వల్ల బీజేపీ రాష్ట్రంలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారి అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి అవకాశం లేని స్థానాల్లో కేవలం బండి సంజయ్ మాత్రమే ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించి పార్టీలోకి తీసుకొని ఏకధాటిపై ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!