Mamata Banerjee: రాష్ట్ర మహిళల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దు.. ప్రధానిపై దీదీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. అఘాయిత్యాలపై తప్పుడు ప్రకటనలు చేస్తూ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ప్రధాని మోడీపై సీఎం మమత విరుచుకుపడ్డారు. బొంగావ్లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో బిజెపి పాలిత రాష్ట్రాల మాదిరిగా లేదని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని అన్నారు. అంతేకాకుండా.. ఇక్కడ మహిళల ఆత్మగౌరవంతో ఆడవద్దని, మా అమ్మానాన్నల గౌరవంతో ఆడుకుని కుట్ర పన్నవద్దని ఆరోపించారు. సందేశ్ఖాలీలో టీఎంసీ తన గత అకృత్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆదివారం బహిరంగ సభలో ప్రధాని ఆరోపించిన సంగతి తెలిసిందే.
Attack On TTE: టికెట్ అడిగినందుకు టీటీఈ పై దాడి.. చివరకు..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
మరోవైపు.. ఉత్తర 24 పరగణాల వంటి సరిహద్దు జిల్లాల్లో రాష్ట్ర అధికార పార్టీ కార్యకర్తలను భయపెట్టేందుకు బీజేపీ కేంద్ర బలగాలను ఉపయోగిస్తోందని టీఎంసీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీని అమలు చేయడానికి అనుమతించబోమని సీఎం మమత మరోసారి పునరుద్ఘాటించారు. అయితే.. బెంగాల్లో సీఏఏ అమలు చేస్తామని ప్రధాని మోడీ నిన్న చెప్పారని.. అయితే మేము దానిని అంగీకరించడం లేదని అన్నారు. అయితే ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
Covid 19: మహారాష్ట్రలో కొత్త కోవిడ్ సబ్ వేరియెంట్ తో 91 కేసులు నమోదు..
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 300 సీట్లకు పైగా గెలుస్తుందని టీఎంసీ అధిష్టానం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుందన్నారు. అయితే, బెంగాల్లో తాము ఒంటరిగా బీజేపీతో పోరాడుతున్నామని తెలిపారు. మరోవైపు.. మహిళల కోసం రాష్ట్ర ఆర్థిక సహాయ పథకం ‘లక్ష్మీ భండార్’ను ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం బెనర్జీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..