DK.shivakumar: ప్రత్యర్థుల పూజలపై డీకే.శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా కేరళలోని ఓ ఆలయంలో రాజకీయ ప్రత్యర్థులు ‘అఘోరీలు’, ‘తాంత్రికుల’ ద్వారా మాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Buchi Babu: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ఇంట్లో తీవ్ర విషాదం!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
శివకుమార్ మీడియా మాట్లాడారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ‘అఘోరీలు’ యాగం నిర్వహిస్తున్నట్లు తనకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే కర్మకాండ చేస్తున్నారని తెలిపారు. యాగం యొక్క ప్రధాన లక్ష్యం శత్రువులను నిర్మూలించడం. పూజలో పాల్గొన్న వారు ఈ పరిణామం గురించి తెలియజేసారని ఆయన చెప్పారు. అఘోరీల ద్వారా 21 ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21 నల్లగొర్రెలు, ఐదు పందులను చేతబడికి బలి ఇస్తున్నారని తెలిసిందన్నారు.
ఇది కూడా చదవండి: Vijayawada: విజయవాడలో భారీగా డయేరియా కేసులు.. రేపు నీటి టెస్టుల రిపోర్ట్..!
దీనికి కార్ణాటకకు చెందిన బీజేపీ, జేడీఎస్ రాజకీయ నాయకులే కారణమని ఆయన అన్నారు. ఈ ఆచారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో తనకు తెలుసు అని చెప్పారు. వారు తమ ప్రయత్నాలను కొనసాగించనివ్వండన్నారు. వాళ్లు ఎన్ని చేసినా తాము నమ్మిన శక్తి రక్షిస్తుందని శివకుమార్ చెప్పుకొచ్చారు. ఈ ఆచారానికి వ్యతిరేక పూజలు చేస్తారా? అన్న ప్రశ్నకు శివకుమార్ సమాధానమిస్తూ.. తాను ప్రతిరోజూ పనికి వెళ్ళే ముందు ఒక నిమిషం పాటు దేవుడిని ప్రార్థిస్తానని చెప్పారు.
జూన్ 2న బెంగళూరులో శాసనసభ్యుల సమావేశం ఉంటుందని శివకుమార్ ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi : కన్యాకుమారిలోని వివేకానంద విగ్రహం ముందు ప్రధాని మోడీ ధ్యానం..ఫోటో రిలీజ్
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!