DK Siva Kumar : కాంగ్రెస్ హైకమాండ్ కు డీకే శివ కుమార్ గట్టి సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఉన్న డీకే శివ కుమార్ కాంగ్రెస్ హైకమాండ్ కు గట్టి సంకేతాలు ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన తన మద్దతుదారులతో సమావేశం అయిన అనంతరం డీకే ప్రెస్మీట్ పెట్టి మరీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేశానని డీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
Also Read : Dialysis Centres : ఆ జిల్లాలో అందుబాటులోకి రెండు కొత్త డయాలసిస్ కేంద్రాలు
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
ప్రెస్ మీట్ పెట్టిన కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏఐసీసీ సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాని అంటూనే పార్టీ గెలుపు కోసం రాష్ట్ర నేతలందరూ కలిసి వచ్చేలా చేశానని డీకే అన్నారు. తాను పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించానని కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా గుర్తు చేశారు. ఒంటరిగా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని డీకే చేసిన వ్యాఖ్యలు తన రేంజ్ ఇది అంటూ హైకమాండ్కు గట్టి సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, సీఎం పేరుపై హైకమాండ్దే తుది నిర్ణయమని చెబుతూనే.. ఏదైనా తేడా వస్తే తనకంటూ బలం ఉందని, ఓ వర్గం కూడా ఉందని కాంగ్రెస్ హైకమాండ్కు చెప్పెందుకే డీకే శివ కుమార్ ప్రెస్మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read : Prashant Kishore : ప్రశాంత్ కిషోర్ కు గాయాలు.. పాదయాత్రకు బ్రేక్
ఇదిలా ఉండగా.. ఢిల్లీకి చేరుకున్న కర్ణాటక పంచాయితీ విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆలోచన మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు పరిశీలకులుగా వెళ్లిన షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ ఇప్పటికే ఢిల్లీలోని మల్లిఖర్జున నివాసానికి చేరుకున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్ హైకమాండ్కు పరిశీలకుల టీం అందజేయనుంది. అయితే పవర్ షేరింగ్ ఫార్ములాపై కాంగ్రెస్ హైకమాండ్ నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎలక్షన్స్ వరకూ సిద్దరామయ్యే సీఎం అని అధిష్టాన వర్గాల నుంచి టాక్ వస్తుంది. ఈ నెల 18న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని, విపక్షాల నేతలనూ ఆహ్వానించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Also Read : Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి క్రేజీ అప్డేట్.. ఆరోజు దద్దరిల్లిపోవాల్సిందే!
కాంగ్రెస్ అధ్యక్షులు నాతోనే ఉన్నారు.. నా నాయకత్వంలోనే కాంగ్రెస్ కు 135 సీట్లు వచ్చాయని డీకే శివ కుమార్ అన్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ దే తుది నిర్ణయం అని ఆయన చెప్పాడు. ఈ ఎన్నికల్లో నా కర్త్యవం నేను చేశాను.. ఇక కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఎంటీ అనేది తెలియాల్సి ఉంది అని డీకే శివ కుమార్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!