DK Siva Kumar : కాంగ్రెస్ హైకమాండ్ కు డీకే శివ కుమార్ గట్టి సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఉన్న డీకే శివ కుమార్ కాంగ్రెస్ హైకమాండ్ కు గట్టి సంకేతాలు ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన తన మద్దతుదారులతో సమావేశం అయిన అనంతరం డీకే ప్రెస్మీట్ పెట్టి మరీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేశానని డీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
Also Read : Dialysis Centres : ఆ జిల్లాలో అందుబాటులోకి రెండు కొత్త డయాలసిస్ కేంద్రాలు
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
ప్రెస్ మీట్ పెట్టిన కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏఐసీసీ సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాని అంటూనే పార్టీ గెలుపు కోసం రాష్ట్ర నేతలందరూ కలిసి వచ్చేలా చేశానని డీకే అన్నారు. తాను పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించానని కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా గుర్తు చేశారు. ఒంటరిగా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని డీకే చేసిన వ్యాఖ్యలు తన రేంజ్ ఇది అంటూ హైకమాండ్కు గట్టి సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, సీఎం పేరుపై హైకమాండ్దే తుది నిర్ణయమని చెబుతూనే.. ఏదైనా తేడా వస్తే తనకంటూ బలం ఉందని, ఓ వర్గం కూడా ఉందని కాంగ్రెస్ హైకమాండ్కు చెప్పెందుకే డీకే శివ కుమార్ ప్రెస్మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read : Prashant Kishore : ప్రశాంత్ కిషోర్ కు గాయాలు.. పాదయాత్రకు బ్రేక్
ఇదిలా ఉండగా.. ఢిల్లీకి చేరుకున్న కర్ణాటక పంచాయితీ విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆలోచన మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు పరిశీలకులుగా వెళ్లిన షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ ఇప్పటికే ఢిల్లీలోని మల్లిఖర్జున నివాసానికి చేరుకున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్ హైకమాండ్కు పరిశీలకుల టీం అందజేయనుంది. అయితే పవర్ షేరింగ్ ఫార్ములాపై కాంగ్రెస్ హైకమాండ్ నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎలక్షన్స్ వరకూ సిద్దరామయ్యే సీఎం అని అధిష్టాన వర్గాల నుంచి టాక్ వస్తుంది. ఈ నెల 18న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని, విపక్షాల నేతలనూ ఆహ్వానించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Also Read : Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి క్రేజీ అప్డేట్.. ఆరోజు దద్దరిల్లిపోవాల్సిందే!
కాంగ్రెస్ అధ్యక్షులు నాతోనే ఉన్నారు.. నా నాయకత్వంలోనే కాంగ్రెస్ కు 135 సీట్లు వచ్చాయని డీకే శివ కుమార్ అన్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ దే తుది నిర్ణయం అని ఆయన చెప్పాడు. ఈ ఎన్నికల్లో నా కర్త్యవం నేను చేశాను.. ఇక కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఎంటీ అనేది తెలియాల్సి ఉంది అని డీకే శివ కుమార్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!