DK Aruna: కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు!
- బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు
- సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం లేదు
- బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు ఇదంతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు అని ప్రభుత్వంను ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అని విమర్శించారు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు అప్పగించారని.. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు.. ఇదంతా ఒక పన్నాగం అని మండిపడ్డారు. బీఆర్ఎస్ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని, 20 నెలల కింద ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని డీకే అరుణ చెప్పారు.
’20 నెలల కింద ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. బీజేపీ పైన బురద జల్లెందుకే ఈ సీబీఐ విచారణ. బీఆర్ఎస్ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకే కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తుంది. కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు. మేము అధికారంలో అవినీతి సొమ్మును కక్కిస్తామని అన్నారు. కానీ వారిని కాపాడడంలోనే బిజీగా ఉన్నారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. సీబీఐకి ఎందుకు ఇచ్చినట్టు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి ఇచ్చారు. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందని నమ్మకం లేదు. సాక్ష్యాలు ఇవ్వరు.. మాయం చేస్తారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు ఇదంతా ఒక పన్నాగం. బీఆర్ఎస్ హైడ్రామా ఆడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు’ అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
Also Read: Kalvakuntla Kavitha: ‘నాన్నా’ జాగ్రత్త.. మీ వెనక భారీ కుట్ర జరుగుతోంది!
‘కేసీఆర్ వారసత్వం పోరాటం.. ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేసీఆర్ సపోర్ట్ లేకుండా కాళేశ్వరంలో ఏదైనా జరిగిందా?. అవినీతికి బాధ్యత ఆ కుటుంబంలోని అందరిదే. లిక్కర్ కేసులో కవిత కూడా జైలుకు పోయి వచ్చింది. గద్వాలలో అభివృద్ధి కుంటుపడింది. అక్కడ ప్రజా ప్రతినిధికి ఎలాంటి సంబంధం లేదు. మెడికల్ కాలేజీలో మా ప్రయత్నం కూడా ఉంది. ఈ విషయంపై చర్చకు సిద్ధం. రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో.. ఇదంటే ఆయనకు కోపం వస్తుంది. చేతకాని వాళ్ళు చాలా మాట్లాడుతారు. ఆయన చేతనయ్యి గెలవలేదు.. చావు తప్పి లొట్టపోయి గెలిచారు. మహబూబ్ నగర్ నా సొంత జిల్లా. నేను ఎక్కడో పోయి పోటీ పడలేదు. మా ఇంట్లో నుండే ఆయనకి రాజకీయ జీవితం.. మేము లేకపోతే అయన ఎక్కడ. కొమ్ములొచ్చి చాలా మాట్లాడుతున్నారు’ అని డీకే అరుణ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
ట్రెండింగ్
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?