DK Aruna: కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు!
- బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు
- సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం లేదు
- బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు ఇదంతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు అని ప్రభుత్వంను ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అని విమర్శించారు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు అప్పగించారని.. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు.. ఇదంతా ఒక పన్నాగం అని మండిపడ్డారు. బీఆర్ఎస్ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని, 20 నెలల కింద ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని డీకే అరుణ చెప్పారు.
’20 నెలల కింద ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. బీజేపీ పైన బురద జల్లెందుకే ఈ సీబీఐ విచారణ. బీఆర్ఎస్ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకే కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తుంది. కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు. మేము అధికారంలో అవినీతి సొమ్మును కక్కిస్తామని అన్నారు. కానీ వారిని కాపాడడంలోనే బిజీగా ఉన్నారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. సీబీఐకి ఎందుకు ఇచ్చినట్టు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి ఇచ్చారు. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందని నమ్మకం లేదు. సాక్ష్యాలు ఇవ్వరు.. మాయం చేస్తారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు ఇదంతా ఒక పన్నాగం. బీఆర్ఎస్ హైడ్రామా ఆడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు’ అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
Also Read: Kalvakuntla Kavitha: ‘నాన్నా’ జాగ్రత్త.. మీ వెనక భారీ కుట్ర జరుగుతోంది!
‘కేసీఆర్ వారసత్వం పోరాటం.. ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేసీఆర్ సపోర్ట్ లేకుండా కాళేశ్వరంలో ఏదైనా జరిగిందా?. అవినీతికి బాధ్యత ఆ కుటుంబంలోని అందరిదే. లిక్కర్ కేసులో కవిత కూడా జైలుకు పోయి వచ్చింది. గద్వాలలో అభివృద్ధి కుంటుపడింది. అక్కడ ప్రజా ప్రతినిధికి ఎలాంటి సంబంధం లేదు. మెడికల్ కాలేజీలో మా ప్రయత్నం కూడా ఉంది. ఈ విషయంపై చర్చకు సిద్ధం. రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో.. ఇదంటే ఆయనకు కోపం వస్తుంది. చేతకాని వాళ్ళు చాలా మాట్లాడుతారు. ఆయన చేతనయ్యి గెలవలేదు.. చావు తప్పి లొట్టపోయి గెలిచారు. మహబూబ్ నగర్ నా సొంత జిల్లా. నేను ఎక్కడో పోయి పోటీ పడలేదు. మా ఇంట్లో నుండే ఆయనకి రాజకీయ జీవితం.. మేము లేకపోతే అయన ఎక్కడ. కొమ్ములొచ్చి చాలా మాట్లాడుతున్నారు’ అని డీకే అరుణ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..