Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్ను హత్య చేయడానికి ప్రయత్నించింది వాణినే.. మాధురి కౌంటర్
- దువ్వాడ వాణి వ్యాఖ్యలకు దివ్వెల మాధురి కౌంటర్
- సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు
- దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయడానికి ప్రయత్నించింది వాణినే అంటూ వ్యాఖ్యలు
Divvela Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి నుంచి శ్రీనివాస్కు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయడానికి ప్రయత్నించింది దువ్వాడ వాణినే అంటూ దివ్వల మాధురి మళ్లీ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పది రోజులు పాటు మీడియాకు దూరంగానే ఉంటానంటూ వెల్లడించిన మరుసటి రోజే మళ్లీ మాధురి తెరపైకి వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్ వాణి కుటుంబానికి హాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలపై ఘాటైన విమర్శలు చేసింది మాధురి.
Read Also: Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం
Also Read
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
- Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
దువ్వాడ శ్రీనివాస్ మీద దాడికి పాల్పడింది దువ్వాడ కుటుంబ సభ్యులేనని దివ్వెల మాధురి ఆరోపణలు చేసింది. ఇంటి గోడలు పగలగొట్టి చంపడానికి కూడా వెనుకాడలేదని ఆమె వ్యాఖ్యానించింది. తన అనుచరులతో హత్య యత్నానికి ప్రయత్నం చేసిందంటూ ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్కు రెండు కోట్ల వరకు అప్పుగా ఇచ్చానని.. అవి తనకు చెల్లించాకే ఆ ఇంటిపై హక్కులు అడగాలన్నారు. రూ.6 కోట్లతో ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉంటే ఈ కొత్త ఇంటిపై మమకారం ఎందుకో అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ వీడియోలో దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన చెక్కులను మాధురి చూపించారు. రెండు సంవత్సరాలుగా లేని అనుమానం ఇప్పుడు ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు దివ్వెల మాధురి.
ఇదిలా ఉండగా.. ఇవాళ ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోకి భార్య వాణి అక్రమంగా వచ్చి ఇబ్బందులు పెడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, 41ఏ నోటీసులు ఇచ్చామని కోర్టుకు పోలీసులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకి న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
-
Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?