Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్ను హత్య చేయడానికి ప్రయత్నించింది వాణినే.. మాధురి కౌంటర్
- దువ్వాడ వాణి వ్యాఖ్యలకు దివ్వెల మాధురి కౌంటర్
- సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు
- దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయడానికి ప్రయత్నించింది వాణినే అంటూ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divvela Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి నుంచి శ్రీనివాస్కు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయడానికి ప్రయత్నించింది దువ్వాడ వాణినే అంటూ దివ్వల మాధురి మళ్లీ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పది రోజులు పాటు మీడియాకు దూరంగానే ఉంటానంటూ వెల్లడించిన మరుసటి రోజే మళ్లీ మాధురి తెరపైకి వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్ వాణి కుటుంబానికి హాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలపై ఘాటైన విమర్శలు చేసింది మాధురి.
Read Also: Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం
Also Read
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
దువ్వాడ శ్రీనివాస్ మీద దాడికి పాల్పడింది దువ్వాడ కుటుంబ సభ్యులేనని దివ్వెల మాధురి ఆరోపణలు చేసింది. ఇంటి గోడలు పగలగొట్టి చంపడానికి కూడా వెనుకాడలేదని ఆమె వ్యాఖ్యానించింది. తన అనుచరులతో హత్య యత్నానికి ప్రయత్నం చేసిందంటూ ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్కు రెండు కోట్ల వరకు అప్పుగా ఇచ్చానని.. అవి తనకు చెల్లించాకే ఆ ఇంటిపై హక్కులు అడగాలన్నారు. రూ.6 కోట్లతో ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉంటే ఈ కొత్త ఇంటిపై మమకారం ఎందుకో అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ వీడియోలో దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన చెక్కులను మాధురి చూపించారు. రెండు సంవత్సరాలుగా లేని అనుమానం ఇప్పుడు ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు దివ్వెల మాధురి.
ఇదిలా ఉండగా.. ఇవాళ ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోకి భార్య వాణి అక్రమంగా వచ్చి ఇబ్బందులు పెడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, 41ఏ నోటీసులు ఇచ్చామని కోర్టుకు పోలీసులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకి న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!