Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం
- కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
- న్యాయవాది ఖురేషీకి సీపీఆర్ చేసిన జడ్జి
- వెంటనే ఆస్పత్రికి తరలించిన కోర్టు బృందం
- అక్కడ చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు
- నాగ్పూర్ జిల్లా కోర్టులో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల నాగ్పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు. అయినప్పటికీ ఖురేషీలో ఏ మాత్రం చలనం లేదు.
Read Also: Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
దీంతో.. మరొక న్యాయవాది నితిన్ దేశ్ముఖ్ ను సంప్రదించి వైద్య సహాయం కోసం తరలించాలని జడ్జి చెప్పారు. ఈ క్రమంలో.. వెంటనే న్యాయమూర్తి పవార్, న్యాయవాది దేశ్ముఖ్ వెంటనే ఖురేషీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) చోటు చేసుకుంది. బార్ & బెంచ్ నివేదిక ప్రకారం.. “మేము న్యాయవాది ఖురేషీని ఆసుపత్రికి తీసుకుపోయిన వెంటనే, అతన్ని ఐసీయూకి తీసుకువెళ్లారు, కానీ అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు” అని దేశ్ముఖ్ చెప్పారు. అయితే.. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ఖురేషీకి పల్స్ లేదు. అనంతరం.. ఖురేషీ వైద్య రికార్డులను పరిశీలించగా, అతను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తేలింది.
Read Also: CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం
న్యాయవాది దేశ్ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖురేషీ తనకు ఎసిడిటీ వంటి సమస్య ఉందని భావించి కొంతకాలం క్రితం ఎనో తీసుకున్నాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు.. ఖురేషీకి ఇసిజి చేయించుకోవాలని ఒక వైద్యుడు సూచించాడని తెలిపారు. అయితే ఖురేషీ ఇసిజీ చేయించుకోలేదు. ఈ క్రమంలో శనివారం.. కోర్టులో గుండెపోటుకు గురయ్యాడని.. దాని కారణంగా అతను మరణించాడని దేశ్ ముఖ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది ఖురేషీ అకాల మరణం పట్ల నాగ్పూర్ న్యాయవాద సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!