Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం
- కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
- న్యాయవాది ఖురేషీకి సీపీఆర్ చేసిన జడ్జి
- వెంటనే ఆస్పత్రికి తరలించిన కోర్టు బృందం
- అక్కడ చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు
- నాగ్పూర్ జిల్లా కోర్టులో ఘటన.
ఇటీవల నాగ్పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు. అయినప్పటికీ ఖురేషీలో ఏ మాత్రం చలనం లేదు.
Read Also: Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
దీంతో.. మరొక న్యాయవాది నితిన్ దేశ్ముఖ్ ను సంప్రదించి వైద్య సహాయం కోసం తరలించాలని జడ్జి చెప్పారు. ఈ క్రమంలో.. వెంటనే న్యాయమూర్తి పవార్, న్యాయవాది దేశ్ముఖ్ వెంటనే ఖురేషీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) చోటు చేసుకుంది. బార్ & బెంచ్ నివేదిక ప్రకారం.. “మేము న్యాయవాది ఖురేషీని ఆసుపత్రికి తీసుకుపోయిన వెంటనే, అతన్ని ఐసీయూకి తీసుకువెళ్లారు, కానీ అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు” అని దేశ్ముఖ్ చెప్పారు. అయితే.. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ఖురేషీకి పల్స్ లేదు. అనంతరం.. ఖురేషీ వైద్య రికార్డులను పరిశీలించగా, అతను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తేలింది.
Read Also: CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం
న్యాయవాది దేశ్ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖురేషీ తనకు ఎసిడిటీ వంటి సమస్య ఉందని భావించి కొంతకాలం క్రితం ఎనో తీసుకున్నాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు.. ఖురేషీకి ఇసిజి చేయించుకోవాలని ఒక వైద్యుడు సూచించాడని తెలిపారు. అయితే ఖురేషీ ఇసిజీ చేయించుకోలేదు. ఈ క్రమంలో శనివారం.. కోర్టులో గుండెపోటుకు గురయ్యాడని.. దాని కారణంగా అతను మరణించాడని దేశ్ ముఖ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది ఖురేషీ అకాల మరణం పట్ల నాగ్పూర్ న్యాయవాద సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!