Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం
- కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
- న్యాయవాది ఖురేషీకి సీపీఆర్ చేసిన జడ్జి
- వెంటనే ఆస్పత్రికి తరలించిన కోర్టు బృందం
- అక్కడ చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు
- నాగ్పూర్ జిల్లా కోర్టులో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల నాగ్పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు. అయినప్పటికీ ఖురేషీలో ఏ మాత్రం చలనం లేదు.
Read Also: Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
దీంతో.. మరొక న్యాయవాది నితిన్ దేశ్ముఖ్ ను సంప్రదించి వైద్య సహాయం కోసం తరలించాలని జడ్జి చెప్పారు. ఈ క్రమంలో.. వెంటనే న్యాయమూర్తి పవార్, న్యాయవాది దేశ్ముఖ్ వెంటనే ఖురేషీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) చోటు చేసుకుంది. బార్ & బెంచ్ నివేదిక ప్రకారం.. “మేము న్యాయవాది ఖురేషీని ఆసుపత్రికి తీసుకుపోయిన వెంటనే, అతన్ని ఐసీయూకి తీసుకువెళ్లారు, కానీ అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు” అని దేశ్ముఖ్ చెప్పారు. అయితే.. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ఖురేషీకి పల్స్ లేదు. అనంతరం.. ఖురేషీ వైద్య రికార్డులను పరిశీలించగా, అతను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తేలింది.
Read Also: CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం
న్యాయవాది దేశ్ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖురేషీ తనకు ఎసిడిటీ వంటి సమస్య ఉందని భావించి కొంతకాలం క్రితం ఎనో తీసుకున్నాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు.. ఖురేషీకి ఇసిజి చేయించుకోవాలని ఒక వైద్యుడు సూచించాడని తెలిపారు. అయితే ఖురేషీ ఇసిజీ చేయించుకోలేదు. ఈ క్రమంలో శనివారం.. కోర్టులో గుండెపోటుకు గురయ్యాడని.. దాని కారణంగా అతను మరణించాడని దేశ్ ముఖ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది ఖురేషీ అకాల మరణం పట్ల నాగ్పూర్ న్యాయవాద సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?