Canada Army: దౌత్య వివాదం భారత్తో సైనిక సంబంధాలను ప్రభావితం చేయదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diplomatic row won’t affect military ties with India Says Top Canadian Army officer: భారత్, కెనడాల మధ్య తాజా దౌత్య వివాదం కొనసాగుతున్న ద్వైపాక్షిక సైనిక సంబంధాలపై ప్రభావం చూపబోదని, ఈ విషయాన్ని రాజకీయ స్థాయిలో పరిష్కరించాలని కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ మంగళవారం అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్స్ కాన్ఫరెన్స్ (IPACC)లో కెనడియన్ ప్రతినిధి బృందానికి స్కాట్ నాయకత్వం వహిస్తున్నారు. దీనికి 30కి పైగా దేశాల నుండి సైనిక ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ భారత్, కెనడాల మధ్య దౌత్య వివాదం తమ ప్రభావం చూపదని స్కాట్ పేర్కొన్నారు. తాము సమస్యను రాజకీయ స్థాయికి వదిలేస్తామని, దానిని పరిష్కరించడానికి ప్రయత్నించామని ఆయన చెప్పారు. మేజర్ జనరల్ స్కాట్ మాట్లాడుతూ.. తాము ఢిల్లీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉన్నామని, ఈ సమయంలో సమస్యను పెద్దదిగా చేసే విషయాలను తాము పట్టించుకోమన్నారు.
Also Read: India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాదం కోసం పంజాబ్ యువతకు వల..
Also Read
జూన్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. భారత్ ఆ ఆరోపణలను అసంబద్ధమని, ప్రేరేపితమైనవని తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి కెనడా ఒక భారతీయ అధికారిని బహిష్కరించినందుకు టిట్-ఫర్-టాట్ ఎత్తుగడలో కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను భారత్ బహిష్కరించింది. “ఇది రాజకీయ స్థాయిలో మన రెండు దేశాల మధ్య సమస్య. ఖచ్చితంగా మన ప్రధానమంత్రి… ఆయన హౌస్ ఆఫ్ కామన్స్లో లేచి, ప్రస్తుతం కొనసాగుతున్న స్వతంత్ర దర్యాప్తుపై భారతదేశం సహకారాన్ని అభ్యర్థిస్తూ ఒక ప్రకటన చేసారు,” కెనడియన్ ఆర్మీ అధికారి తెలిపారు. ఇది రెండు దేశాల సైన్యాలపై ఎలాంటి ప్రభావం చూపదని, తాను సోమవారం రాత్రి భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో మాట్లాడినట్లు చెప్పారు. ఇది రాజకీయ సమస్య అని, తమ సంబంధాలపై ఎటువంటి జోక్యం లేదని అంగీకరించామని మేజర్ జనరల్ స్కాట్ పేర్కొన్నారు.
Also Read: Aadhaar: ఆధార్ వల్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు.. కేంద్రం ఏం చెబుతోంది?
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి భారత సైన్యం ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్ల రెండు రోజుల సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. కాన్ఫరెన్స్లో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ పాండే తన ప్రారంభ ప్రసంగంలో.. ఇండో-పసిఫిక్ కోసం భారతదేశపు దృక్పథం అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!