Diabetes Effects: మధుమేహం వల్ల ఏ అవయవలపై ప్రభావితమవుతుందో తెలుసా?
- మధుమేహం అనేది శరీరంలోని చక్కెర (గ్లూకోజ్) స్థాయిని నియంత్రించలేని వ్యాధి.
- మూత్రపిండాలపై ప్రభావం
- కళ్లపై ప్రభావం
- నాడీ వ్యవస్థపై ప్రభావం.
Diabetes Effects: మధుమేహం అనేది శరీరంలోని చక్కెర (గ్లూకోజ్) స్థాయిని నియంత్రించలేని వ్యాధి. ఈ వ్యాధి క్రమంగా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. దీని మొదటి ప్రభావం మన మూత్రపిండాలు, గుండె, నాడీ వ్యవస్థ, కళ్ళు, పాదాలపై ఉంటుంది. ఇకపోతే, మధుమేహం ఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది ఎలాంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుందో తెలుసుకుందాం.
Read Also: IND vs SA: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి టీ20.. సిరీస్ గెలిచేనా..?
Also Read
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
- Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?
- Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
మూత్రపిండాలపై ప్రభావం:
మధుమేహం అతిపెద్ద ప్రభావం మూత్రపిండాలపై ఉంటుంది. మధుమేహం మూత్రపిండాల రక్తనాళాలకు హాని కలిగిస్తుంది. దీని కారణంగా మూత్రపిండాల వడపోత సామర్థ్యం తగ్గుతుంది. దాంతో శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది క్రమంగా మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతుంది. దీనినే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే, కిడ్నీ మార్పిడి లేదా డయాలసిస్ అవసరం కావచ్చు.
గుండెపై ప్రభావం:
మధుమేహం గుండెపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అధిక చక్కెర స్థాయిలు గుండె ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతాయి. అలాగే రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహంతో బాధపడేవారిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి.
Read Also: IND vs SA: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి టీ20.. సిరీస్ గెలిచేనా..?
నాడీ వ్యవస్థపై ప్రభావం:
మధుమేహం కారణంగా నాడీ వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దీని కారణంగా రోగి చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి లేదా నొప్పిని అనుభవిస్తాడు. ఈ సమస్య కాలక్రమేణా పెరుగుతుంది. అలాగే వ్యక్తి నడవడానికి ఇబ్బంది పడవచ్చు.
కళ్లపై ప్రభావం:
మధుమేహం కళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. దీనినే డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇందులో కళ్లలోని చిన్న రక్తనాళాలు దెబ్బతినడం వల్ల చూపు మసకబారడంతోపాటు అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, మధుమేహం కారణంగా కంటిశుక్లం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
పాదాలపై ప్రభావం:
మధుమేహంతో బాధపడేవారిలో కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోవచ్చు. ఇది పాదాలలో గాయాలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నయం చేయడానికి సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. పాదాలకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
తాజావార్తలు
-
AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
-
AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
-
Saying ‘No’ Effectively: ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోండి.. ఈ 5 చిట్కాలతో పీపుల్- ప్లీజింగ్ అలవాటు వదిలించుకోండి
-
Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?
-
Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?