Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద పునరుద్ధరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. గేట్ల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో ధవళేశ్వరం బ్యారేజీలో 58 కొత్త గేట్లను అమర్చిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇప్పుడు మిగిలిన 117 గేట్లను అత్యాధునిక సాంకేతికతతో మార్చే పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.
Also Read
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటి పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం సముద్రంలోకి 27 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోందని అధికారులు వివరించగా.. కాల్వల ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 14,700 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాల్వల చివరి ఆయకట్టు భూముల వరకు నీరు సక్రమంగా చేరేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం గోదావరి డెల్టా అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. గోదావరి, కోనసీమ ప్రాంతాలు ప్రకృతి అందాలకు నిలయమని, ఆ ప్రత్యేకతను భవిష్యత్తులో కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కోనసీమకు పోటీగా రాయలసీమ కూడా వ్యవసాయంలో ముందుకు వస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించగా.. రాయలసీమలో ప్రస్తుతం నాణ్యమైన ఉద్యాన పంటలు విస్తృతంగా పండుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు వరద నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. అలాగే గోదావరి డెల్టాలోని లక్షలాది ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
-
Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
-
Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
ట్రెండింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?