APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
- ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న నిరసన
- గుండు చేయించుకున్న ఏపీజీఈఎఫ్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి
- ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లకార్డులతో నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APGEF Protest: అమరావతిలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఉద్యోగులు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ఏపీజీఈఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ కాకర్ల వెంకట్రామిరెడ్డి సహా ఇతర ఉద్యోగులు గుండు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలువురు ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఉద్యోగులు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వం పదవీకాలంలో సగం పూర్తయినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరసన బాట పట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఉద్యోగులు గుండు చేయించుకుని ‘ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఉద్యోగుల వేతనాలు, పెండింగ్ సమస్యలు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలు తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం గుండు చేయించుకుని నిర్వహించిన ఈ వినూత్న నిరసన రాష్ట్ర రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘గత ఎన్నికల సమయంలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. లెక్కలేనన్ని హామీలు ఇవ్వటంతో ఉద్యోగులు ఎగబడి కూటమికి ఓట్లేసారు. ఎన్నికల సమయంలో చెప్పిన ఏ హామీ అమలు చేయలేదు. కానీ చంద్రన్న బోడిగుండు పథకం అమలు చేస్తున్నారు. నెలకు ఉద్యోగులకు ప్రభుత్వం చేసే క్షవరం 1500 కోట్లు. ఈ రెండేళ్లలో 32 వేల కోట్లు ప్రభుత్వం క్షవరం చేసింది. ఉద్యోగులకు అర్థమయ్యేలా వివరించటం కోసమే గుండు చేయించుకున్నాం. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఐదు డీఏలు, సహా అరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఐఆర్ కూడా ఇస్తామని చెప్పారు కానీ ఎగ్గొట్టింది. ఒక్కొక్క ఉద్యోగి దాదాపు ఈ రెండేళ్లలో మొత్తం 5.15 లక్షలు రావాల్సి ఉంది’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!