DGP Anjani Kumar : మావోయిస్టు కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరం
రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల . దక్షిణ బస్తర్ లోని అరుణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 26న జరిగిన మందుపాతర పేలుడులో 10 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక పౌరుడు మరణించిన సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజీ ఎస్ఐబీ ప్రభాకర్ రావు, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : Jailer: అంతమంది స్టార్లు ఎందుకురా బుజ్జి.. రజినీ ఒక్కడు చాలాడా..?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు, వీవీఐపీల పర్యటన సమయంలో భద్రతా బలగాలు సంచరించే సమయంలో భద్రతా పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీంల కదలికలు పెరిగే అవకాశం ఉందని, ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డీజీపీ సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐటీ పరిశ్రమలు, అనేక బహుళజాతి సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, ఒకర్ని దెబ్బతీయడం వల్ల వేలాది మందిని భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డీజీపీ సూచించారు. తెలంగాణలో వామపక్షతీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయిందని దీనికి పోలీస్ శాఖ నిరంతర కృషే కారణమన్నారు.
Also Read : Uttar Pradesh : కబాబ్లు బాగో లేవని కుక్ ను కాల్చి చంపారు
మావోయిస్టు చర్యలకు సంబంధించిన కీలక దాడుల్ని ఈ సందర్భంగా డీజీపీ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో 80శాతం కొత్తగా విధుల్లో చేరిన పోలీస్లు ఉండటం వల్ల మావోయిస్టు వ్యూహాలు, చర్యలు, దాడులపై మరింత అవగాహన ఏర్పరుచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. అదనపు డీజీపీ(ఆపరేషన్స్) విజయ్ కుమార్ మాట్లాడుతూ…. పోలీస్ దళాల కదలికల్లో మార్పులు, వ్యూహాల్ని ఎప్పటికప్పడు మారుస్తుండాలన్నారు. వీఐపీల వద్ద ఉండే పీఎస్ఓలకు మావోయిస్టులు జరిపే ఆకస్మిక దాడులు, అనుకోని పరిస్థితులు ఏర్పడితే భద్రత కల్పించే అంశంపై ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐజీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో తీవ్రవాదం పరిస్థితి, పోలీస్ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. గ్రామస్థాయి ప్రజలతో నిరంతరం మమేకమై మావోయిస్టులు, కొత్తవారి కదలికపై సమాచారం సేకరించాలన్నారు. మరీ ముఖ్యంగా సరిహద్దు గ్రామాల పోలీస్లు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వర్క్షాప్లో అన్ని యూనిట్ల అధికారులు, సరిహద్దు ప్రాంత డీఎస్పీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో