Air India: ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారీ జరిమానా విధించింది . దేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్బస్ విమానాన్ని అనుమతులు లేకుండా ఎనిమిది సార్లు నడిపినందుకు ఎయిర్ ఇండియాపై DGCA రూ.1 కోటి జరిమానా విధించినట్లు తెలిపింది. దీనిని చాలా తీవ్రమైన ఉల్లంఘనగా DGCA పరిగణించిందని సమాచారం.
READ ALSO: IPL 2026: కొత్త కెప్టెన్ను ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?
క్లియరెన్స్ లేకుండా 8 సార్లు నింగిలోకి..
ఎయిర్ ఇండియా ఎయిర్బస్ A320 విమానం నవంబర్ 24 – 25 మధ్య ఎయిర్వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ (ARC) లేకుండా ప్రయాణించిందని DGCA గుర్తించింది. ఏదైనా విమానం ఎగరడానికి ఈ సర్టిఫికేట్ అవసరం, భద్రత, ఇతర తనిఖీల తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. నవంబర్ 24 – 25 మధ్య ఎయిర్ ఇండియా ఎయిర్బస్ ఈ సర్టిఫికేట్ లేకుండా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల మధ్య అనేక ప్రయాణీకుల విమానాలను నడిపిందని డీజీసీఏ గుర్తించింది. విమానయాన సంస్థ ప్రవర్తనను తీవ్ర నిర్లక్ష్యంగా డీజీసీఏ పరిగణించిందని పలు వర్గాలు తెలిపాయి. ఇలాంటి కేసుల్లో డీజీసీఏ కఠిన చర్యలు తీసుకుంటుందని, అందుకే ఎయిర్ ఇండియాకు గరిష్ట జరిమానా విధించినట్లు పలు వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ను కూడా జవాబుదారీగా చేసినట్లు సమాచారం.
గత ఏడాది డిసెంబర్లో ఎయిర్ ఇండియా తనను తాను తనిఖీ చేసుకున్నప్పుడు, సంస్థ పనితీరులో కొన్ని లోపాలు ఉన్నాయని తేలింది. అప్పుడు వారు తమ పద్ధతులను మార్చుకుంటామని ఒప్పుకున్నారు. కానీ, ఈసారి పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. దాంతో పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) రంగంలోకి దిగి, ఎయిర్ ఇండియాపై భారీ జరిమానా విధించింది
ఎయిర్ ఇండియా ఏం చెప్పింది?
DGCA చర్యకు ప్రతిస్పందిస్తూ, ఎయిర్ ఇండియా ప్రతినిధి తాజాగా మాట్లాడారు. 2025లోనే ఈ విషయాన్ని ఎయిర్లైన్ స్వయంగా DGCA నివేదించిందని పేర్కొన్నారు. అన్ని లోపాలను సంతృప్తికరంగా పరిష్కరించామని, దానికి సంబంధించిన సమాచారం కూడా అధికారులకు అందించామని ఆయన వెల్లడించారు. ప్రయాణీకుల భద్రత, కార్యాచరణ, అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి ఎయిర్లైన్ తన పూర్తి నిబద్ధతను కొనసాగిస్తోందన్నారు.
READ ALSO: Iran Hit List: ఇరాన్ టార్గెట్లో ఆ దేశాధినేతే ఫస్ట్.. ఎవరో తెలుసా?