Air India: ఎయిర్ ఇండియాకు రూ.కోటి జరిమానా విధించిన DGCA.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారీ జరిమానా విధించింది . దేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్బస్ విమానాన్ని అనుమతులు లేకుండా ఎనిమిది సార్లు నడిపినందుకు ఎయిర్ ఇండియాపై DGCA రూ.1 కోటి జరిమానా విధించినట్లు తెలిపింది. దీనిని చాలా తీవ్రమైన ఉల్లంఘనగా DGCA పరిగణించిందని సమాచారం.
READ ALSO: IPL 2026: కొత్త కెప్టెన్ను ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
క్లియరెన్స్ లేకుండా 8 సార్లు నింగిలోకి..
ఎయిర్ ఇండియా ఎయిర్బస్ A320 విమానం నవంబర్ 24 – 25 మధ్య ఎయిర్వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ (ARC) లేకుండా ప్రయాణించిందని DGCA గుర్తించింది. ఏదైనా విమానం ఎగరడానికి ఈ సర్టిఫికేట్ అవసరం, భద్రత, ఇతర తనిఖీల తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. నవంబర్ 24 – 25 మధ్య ఎయిర్ ఇండియా ఎయిర్బస్ ఈ సర్టిఫికేట్ లేకుండా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల మధ్య అనేక ప్రయాణీకుల విమానాలను నడిపిందని డీజీసీఏ గుర్తించింది. విమానయాన సంస్థ ప్రవర్తనను తీవ్ర నిర్లక్ష్యంగా డీజీసీఏ పరిగణించిందని పలు వర్గాలు తెలిపాయి. ఇలాంటి కేసుల్లో డీజీసీఏ కఠిన చర్యలు తీసుకుంటుందని, అందుకే ఎయిర్ ఇండియాకు గరిష్ట జరిమానా విధించినట్లు పలు వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ను కూడా జవాబుదారీగా చేసినట్లు సమాచారం.
గత ఏడాది డిసెంబర్లో ఎయిర్ ఇండియా తనను తాను తనిఖీ చేసుకున్నప్పుడు, సంస్థ పనితీరులో కొన్ని లోపాలు ఉన్నాయని తేలింది. అప్పుడు వారు తమ పద్ధతులను మార్చుకుంటామని ఒప్పుకున్నారు. కానీ, ఈసారి పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. దాంతో పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) రంగంలోకి దిగి, ఎయిర్ ఇండియాపై భారీ జరిమానా విధించింది
ఎయిర్ ఇండియా ఏం చెప్పింది?
DGCA చర్యకు ప్రతిస్పందిస్తూ, ఎయిర్ ఇండియా ప్రతినిధి తాజాగా మాట్లాడారు. 2025లోనే ఈ విషయాన్ని ఎయిర్లైన్ స్వయంగా DGCA నివేదించిందని పేర్కొన్నారు. అన్ని లోపాలను సంతృప్తికరంగా పరిష్కరించామని, దానికి సంబంధించిన సమాచారం కూడా అధికారులకు అందించామని ఆయన వెల్లడించారు. ప్రయాణీకుల భద్రత, కార్యాచరణ, అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి ఎయిర్లైన్ తన పూర్తి నిబద్ధతను కొనసాగిస్తోందన్నారు.
READ ALSO: Iran Hit List: ఇరాన్ టార్గెట్లో ఆ దేశాధినేతే ఫస్ట్.. ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!