IPL 2026: కొత్త కెప్టెన్ను ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?
- కొత్త కెప్టెన్ను ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్
- ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కే మొగ్గుచూపింది
- పరాగ్ 84 ఐపీఎల్ మ్యాచ్ల్లో 141.84 స్ట్రైక్ రేట్తో 1,566 పరుగులు చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) కి రాజస్థాన్ రాయల్స్ (RR) కొత్త కెప్టెన్ను ప్రకటించింది. IPL తొలి ఎడిషన్లో టైటిల్ గెలుచుకున్న జట్టు, అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా కంటే ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కే మొగ్గుచూపింది. ఫ్రాంచైజీ పరాగ్ను రెగ్యులర్ కెప్టెన్గా నియమించింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమైన సంజు సామ్సన్ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గత సంవత్సరం సంజు సామ్సన్ గాయపడినప్పుడు అస్సాంకు చెందిన రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పుడు సంజు సామ్సన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి మారాడు. రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ రాజస్థాన్ రాయల్స్లో చేరారు.
Also Read:Andhra Pradesh Budget: రేపే ఏపీ బడ్జెట్.. 10.30కి కేబినెట్.. 11.15కి బడ్జెట్ 2026-27
Also Read
24 ఏళ్ల పరాగ్ గత సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎనిమిది మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లలో రాజస్థాన్ కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. ఆ మ్యాచ్లలో పరాగ్ 38.57 సగటుతో పరుగులు చేశాడు. ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)పై అతను కెరీర్లో అత్యుత్తమ 95 పరుగులు చేశాడు.
పరాగ్ కెప్టెన్సీలో, రాజస్థాన్ ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్, కోచ్ ఇద్దరినీ మార్చింది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కుమార్ సంగక్కర కోచ్గా నియమితులయ్యారు. గత సంవత్సరం, రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రియాన్ పరాగ్ 2019లో ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. ఏడు సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్లో భాగంగా ఉన్నాడు. రాజస్థాన్ 17 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ను గెలవలేదు. ఫ్రాంచైజీ చివరిసారిగా 2008లో తన మొదటి సీజన్లో ట్రోఫీని దక్కించుకుంది.
పరాగ్ 84 ఐపీఎల్ మ్యాచ్ల్లో 141.84 స్ట్రైక్ రేట్తో 1,566 పరుగులు చేశాడు, అందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అద్భుతమైన ప్రదర్శన 2024లో చేశాడు. 149.21 స్ట్రైక్ రేట్తో 573 పరుగులు చేశాడు. అయితే, గత సీజన్లో అతని స్ట్రైక్ రేట్ 166.52కి పెరిగింది. ఐపీఎల్ 2025లో, రియాన్ 14 మ్యాచ్లు ఆడి 393 పరుగులు చేశాడు, అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ కుమార్ సంగక్కర కూడా పరాగ్ను ప్రశంసిస్తూ, అతన్ని అద్భుతమైన ఆటగాడిగా అభివర్ణించాడు.
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..