Pawan Kalyan: రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు కానీ.. పరిపాలన గాడి తప్పకూడదు: డిప్యూటీ సీఎం పవన్
- కలెక్టర్ల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు
- విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ.. పరిపాలన గాడి తప్పకూడదని కలెక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలు తమని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని, వారు తమ ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారన్నారని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని, వాటిని ప్రజలకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్లే పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు అని డిప్యూటీ సీఎం విమర్శించారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, 40 శాఖల అధిపతులు, 26 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకూ సమావేశం కొనసాగనుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘గత ప్రభుత్వం చేసిన పనులు మూలాలు కదిలించేశాయి. ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం కానీ.. వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్లే. గత ప్రభుత్వంలో జరిగిన వాటికి ఐఏఎస్, ఐపీఎస్లు ఎందుకు మాట్లాడరు అనిపించేది. ఒక్కోసారి శ్రీలంకలా మారిపోతుందేమో అనిపించింది. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు. రాళ్లు, రప్పల మధ్య హైదరాబాదు లాంటి నగరం సీఎం చంద్రబాబుకు కనిపించింది. వారసత్వంగా అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే.. అందరూ కలిసి పని చేయాలి’ అని అన్నారు.
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
‘మంత్రి నాదెండ్ల మూడు చెక్ పోస్టులు పెట్టినా.. ఎలా పీడీఎస్ రైస్ రవాణా జరిగింది. ఇసుక విషయంలో ఎవరైనా చెయ్యి పెడితే కఠిన చర్యలుంటాయని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్లు ఏదోటి చేయగలరని నేను బయటి వ్యక్తిగా ఉన్నపుడు అనుకునేవాడిని. అధికారులు ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం చూపించింది. అధికారులు ఎలా ఉండాలంటే.. ఏపీలా ఉండాలనేలా ఇప్పుడు చేయాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు కానీ.. పరిపాలన గాడి తప్పకూడదు. గత ప్రభుత్వం రెవెన్యూ అధికారులతో సినిమా టిక్కెట్లు అమ్మించినా, ఇసుక దోపిడీ చేయించినా ఒక్క అధికారి ఎందుకు మాట్లాడలేదు?.. అంత నిస్సహాయత ఎందుకు?’ అని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?