Bhatti Vikramarka: గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ధరణితో భూములు కోల్పోతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు అమరుల, తాడిత పీడితుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా ప్రమాణం చేశాం.. సభల్లో స్పష్టం చేశామన్నారు.
Asteroid: భూమికి సమీపం నుంచి ప్రమాదకరమైన “గ్రహశకలం”.. సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే.?
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
అధికారంలోకి రాగానే ఇదే అమరుల స్తూపం సాక్షిగా నాగోబా దేవాలయం సాక్షిగా అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. నేటి ఇంద్రవల్లి సభ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బందీ కాగా.. తాము అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరుస్తాం అని ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటించామన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఇచ్చిన మాట మరవకుండా వంశస్తుల నాగోబా దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.
IND vs ENG: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్
అమరుల స్తూపం సాక్షిగా ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గోండుల జీవితాల్లో మార్పు రావాలని తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్ తాను పాదయాత్ర మొదలుపెట్టిన రోజు అమరుల స్తూపం వద్ద గద్దర్ ప్రమాణం చేయించారని గుర్తు చేసుకున్నారు. గోండుల జీవితాల్లో మార్పు కోసం తాను పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్రను ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించిన సంఘటనను భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. ఐటీడీఏల పునరుద్ధరణ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆర్థిక సాయం పెంచడం, త్రివేణి సంగమం అభివృద్ధి చిహ్మాన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని నేడు కోరారు. ఈ పనులన్నీటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!