Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందనే భయం కేసీఆర్లో కనిపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఎన్డీవీ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలను గెలిచి కూడా మా పార్టీలోని 12 ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు అనే విషయాన్ని గుర్తు చేశారు. మేము ఎప్పుడూ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, నలిపేస్తాం, మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని తప్పుడు మాటలు మాట్లాడలేదని చెప్పారు. మేము ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టడమే మా యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. మేము ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కానీ, ఏ శాసన సభ్యుడిని గానీ, బలవంతంగా వచ్చి.. బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకోవడం లేదు.. వాళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Read Also: Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 29కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య
Also Read
కేసీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. పలు సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే వస్తాయని తేలింది.. కేసీఆర్ కు వచ్చే సీట్లు వస్తాయని చెబుతున్నారు.. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ చెప్పే మాయమాటలు ప్రజలకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే సగానికి పైగా హామీలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ప్రతి హామీని వంద శాతం మేం అమలు చేసి తీరుతాం.. బీఆర్ఎస్ ప్రభుత్వంలా మేము మోసాలు చేయం అని ఆయన పేర్కొన్నారు. ఇక, గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఎన్నీ హామీలను అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధును కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇచ్చారని పేర్కొన్నారు. 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి దళితులను బీఆర్ఎస్ పార్టీ దారుణంగా మోసం చేసిందన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ- బీఆర్ఎస్ కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Off The Record: రాయలసీమ బలిజల మొగ్గు ఎటువైపు..?
కరెంట్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తుంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు లేకుండా నిరంతర విద్యుత్ ను ప్రజలకు అందిస్తున్నాము.. కరెంట్ కోతలు అనేవి అవాస్తవం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్వాలిటీ విద్యుత్ ను అందిస్తున్నాం.. విద్యుత్, ఆర్థికశాఖలను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్థం చేసింది.. ఈ రెండు శాఖలు మాకు ఒక సవాల్ అని తెలిపారు. ఇక, హైదరాబాద్ కి వాటర్ సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంచి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!