Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 29కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోల సంఖ్య 29కి చేరింది. ఛోట్బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో.. పోలీసులు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగగా.. 29 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో DRG మరియు BSF బృందాలు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో 25 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ కమాండర్ శంకర్ రావు కూడా మరణించినట్లు సమాచారం.
కాగా.. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక ఇన్స్పెక్టర్తో సహా ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ కాలికి కాల్పులు జరగగా, కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు.. నక్సలైట్ల నుంచి ఏడు ఏకే 47, మూడు ఎల్ఎంజీ ఆయుధాలు, ఇన్సాస్ రైఫిల్ భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. 10 మంది నక్సలైట్ల మృతదేహాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోందని కంకేర్ జిల్లా ఎస్పీ ఐకె అలెసెల తెలిపారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని.. ఈ ఎన్కౌంటర్లో గాయపడిన సైనికుల పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. గాయపడిన సైనికులకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
Off The Record: టీడీపీలో కొత్త రకం చర్చ.. కొందరు నేతలు రివర్స్ స్వింగ్లో ఉన్నారా?
ఇదిలా ఉంటే.. 10 రోజుల క్రితం జిల్లాలోని కోర్చోలి, లేంద్ర అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది నక్సలైట్లను పోలీసులు హతమార్చారు. ఇంచుమించు అంతే సంఖ్యలో నక్సలైట్లు తీవ్రంగా గాయపడ్డారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లేంద్రలో ఏప్రిల్ 2న జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది నక్సలైట్లలో 11 మందిని గుర్తించారు.
ఆరు రోజుల క్రితం హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ రెండు రోజుల పర్యటన నిమిత్తం దేకాకు చేరుకున్నారు. అక్కడ అతను ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో 10 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. శాంతియుత లోక్సభ ఎన్నికలు, నక్సల్స్ ప్రాంతాల్లో వ్యూహరచనపై సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్పుట్ల ఆధారంగా, నక్సల్ ఫ్రంట్లలో మరిన్ని గూఢచార కార్యకలాపాలకు వ్యూహాలు రూపొందించారు. అలాగే ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా కశ్మీర్ తరహాలో టార్గెట్ బేస్ ఆపరేషన్ చేపట్టాలనే చర్చ జరిగింది. ఆ ప్రభావమే కాంకేర్ ఎన్కౌంటర్ లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!