Bhatti Vikramarka: స్వాతంత్య్రం కంటే ముందు నుంచి సింగరేణి.. సంస్థ విశ్వవ్యాప్తంగా విస్తరించాలి
- మెటల్స్.. నాన్ మెటల్స్ మైనింగ్ లో అడుగు పెట్టాలి
- లిథియంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి
- సింగరేణిపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి సంస్థ దేశ స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ.. ఎంతో నిష్ణాతులైన, సమర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. శని వారం బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రణాళిలు, అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధన వనరులకు కాలం చెల్లుతోంది. భవిష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మారబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో లిథియం వంటి అనేక మూలకాల అన్వేషణ, వాటిని వెలికితీయడంపై సింగరేణి దృష్టి సారించాలని చెప్పారు.
READ MORE: Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
Also Read
- Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
- Harbhajan Singh: "అస్సలు భయపడొద్దు".. వైభవ్ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
- Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
సింగరేణి సంస్థ తన మనుగడను కొనసాగిస్తూ ఆస్తులను సంపదను సృష్టించుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్ర ప్రజల సంపదైన సింగరేణి ద్వారా ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సింగరేణి సంస్థ మెటల్స్, నాన్ మెటల్స్ మైనింగ్ లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ఒక కన్సెల్టెన్సీని నియమించుకోవాలని సింగరేణి అధికారులకు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రికి సింగరేణి అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తీ డీపీఆర్ లు రూపొందిస్తున్నామని.. త్వరలోనూ వాటిని ప్రభుత్వానికి అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించారు. ఒరిస్సాలోని నైనీ బ్లాక్ లో బొగ్గు ఎప్పటినుంచి ఉత్పత్తి ఆరంభిస్తారని ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
తాజావార్తలు
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
ట్రెండింగ్
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!