Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
- తల్లిని హతమార్చిన తనయుడు
- మేకను అమ్మే విషయంలో గొడవ
- మాతృమూర్తిని సజీవదహనం చేసిన కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లను ఎలా పెంచాలీ… వాళ్లకోసం ఏం చేయాలీ… ఇలా ఎన్నో ఆలోచిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు వేసే బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతుంటారు. బిడ్డకు చిన్న కష్టమొస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది. కానీ.. అలాంటి తల్లులకు పిల్లలు ప్రస్తుతం మర్యాద ఇవ్వడం లేదు. రెక్కలొచ్చాక కని పెంచిన తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్నారు. మరి కొందరైతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో హత్యాయత్నం సంచలనం సృష్టించింది. మేకను అమ్మే విషయమై గొడవపడి కొడుకు తన తల్లిని సజీవ దహనం చేశారు. ఈ సంఘటనకు బచ్రా గ్రామంలో చోటుచేసుకుంది. మేకలను అమ్మడంపై జరిగిన గొడవలో..తన 50 ఏళ్ల మాతృమూర్తిని ఆమె కొడుకు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
READ MORE: UP Video: యూపీలో వీధి కుక్కు స్వైర విహారం.. గంటలో 17 మందిపై ఎటాక్
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
శుక్రవారం రాత్రి తల్లి దేవి -కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ మధ్య మేకను అమ్మే విషయంపై గొడవ తలెత్తింది. తల్లి దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన కమలేష్ ఓ పరికరంతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఇంతటితో ఆగకుండా కుమారుడు తన తల్లి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమె కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ ఆమెను బట్టల కింద దాచి పెట్రోలు పోసి నిప్పంటించాడని అదనపు ఎస్పీ త్రిభువన్ నాథ్ త్రిపాఠి తెలిపారు. ఇరుగుపొరుగు వారు ఇంటికి పరిగెత్తి మంటలను ఆర్పివేశారని, అయితే అప్పటికే మహిళ చనిపోయిందని చెప్పారు. హత్య కేసులో మహిళ కుమారుడు కిషున్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!