Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
- తల్లిని హతమార్చిన తనయుడు
- మేకను అమ్మే విషయంలో గొడవ
- మాతృమూర్తిని సజీవదహనం చేసిన కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లను ఎలా పెంచాలీ… వాళ్లకోసం ఏం చేయాలీ… ఇలా ఎన్నో ఆలోచిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు వేసే బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతుంటారు. బిడ్డకు చిన్న కష్టమొస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది. కానీ.. అలాంటి తల్లులకు పిల్లలు ప్రస్తుతం మర్యాద ఇవ్వడం లేదు. రెక్కలొచ్చాక కని పెంచిన తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్నారు. మరి కొందరైతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో హత్యాయత్నం సంచలనం సృష్టించింది. మేకను అమ్మే విషయమై గొడవపడి కొడుకు తన తల్లిని సజీవ దహనం చేశారు. ఈ సంఘటనకు బచ్రా గ్రామంలో చోటుచేసుకుంది. మేకలను అమ్మడంపై జరిగిన గొడవలో..తన 50 ఏళ్ల మాతృమూర్తిని ఆమె కొడుకు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
READ MORE: UP Video: యూపీలో వీధి కుక్కు స్వైర విహారం.. గంటలో 17 మందిపై ఎటాక్
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
శుక్రవారం రాత్రి తల్లి దేవి -కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ మధ్య మేకను అమ్మే విషయంపై గొడవ తలెత్తింది. తల్లి దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన కమలేష్ ఓ పరికరంతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఇంతటితో ఆగకుండా కుమారుడు తన తల్లి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమె కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ ఆమెను బట్టల కింద దాచి పెట్రోలు పోసి నిప్పంటించాడని అదనపు ఎస్పీ త్రిభువన్ నాథ్ త్రిపాఠి తెలిపారు. ఇరుగుపొరుగు వారు ఇంటికి పరిగెత్తి మంటలను ఆర్పివేశారని, అయితే అప్పటికే మహిళ చనిపోయిందని చెప్పారు. హత్య కేసులో మహిళ కుమారుడు కిషున్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!