Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
- తల్లిని హతమార్చిన తనయుడు
- మేకను అమ్మే విషయంలో గొడవ
- మాతృమూర్తిని సజీవదహనం చేసిన కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లను ఎలా పెంచాలీ… వాళ్లకోసం ఏం చేయాలీ… ఇలా ఎన్నో ఆలోచిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు వేసే బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతుంటారు. బిడ్డకు చిన్న కష్టమొస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది. కానీ.. అలాంటి తల్లులకు పిల్లలు ప్రస్తుతం మర్యాద ఇవ్వడం లేదు. రెక్కలొచ్చాక కని పెంచిన తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్నారు. మరి కొందరైతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో హత్యాయత్నం సంచలనం సృష్టించింది. మేకను అమ్మే విషయమై గొడవపడి కొడుకు తన తల్లిని సజీవ దహనం చేశారు. ఈ సంఘటనకు బచ్రా గ్రామంలో చోటుచేసుకుంది. మేకలను అమ్మడంపై జరిగిన గొడవలో..తన 50 ఏళ్ల మాతృమూర్తిని ఆమె కొడుకు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
READ MORE: UP Video: యూపీలో వీధి కుక్కు స్వైర విహారం.. గంటలో 17 మందిపై ఎటాక్
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
శుక్రవారం రాత్రి తల్లి దేవి -కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ మధ్య మేకను అమ్మే విషయంపై గొడవ తలెత్తింది. తల్లి దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన కమలేష్ ఓ పరికరంతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఇంతటితో ఆగకుండా కుమారుడు తన తల్లి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమె కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ ఆమెను బట్టల కింద దాచి పెట్రోలు పోసి నిప్పంటించాడని అదనపు ఎస్పీ త్రిభువన్ నాథ్ త్రిపాఠి తెలిపారు. ఇరుగుపొరుగు వారు ఇంటికి పరిగెత్తి మంటలను ఆర్పివేశారని, అయితే అప్పటికే మహిళ చనిపోయిందని చెప్పారు. హత్య కేసులో మహిళ కుమారుడు కిషున్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!