Devendra Fadnavis : కావాలనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని అకోలాలో సోషల్ మీడియాలో పోస్ట్పై మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రయత్నాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, అయితే ఈ ప్రయత్నాలు ఫలించవని, ప్రభుత్వం వీటిని అణిచి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సంఘ వ్యతిరేక శక్తులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన వెల్లడించారు. దీని వెనుక (రాజకీయంగా ప్రేరేపించబడింది) కొన్ని సంస్థలు దీని వెనుక ఉన్నాయి అని డిప్యూటీ సీఎం అన్నారు.
Also Read : Ramcharan: మండు వేసవిలో చల్లటి స్ఫూర్తి పంచుతున్న రామ్చరణ్ ఫ్యాన్స్!
Also Read
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
మహారాష్ట్రలో ఇటీవలి హింసాత్మక సంఘటనలపై ఫడ్నవీస్ స్పందిస్తూ, సరైన సమయంలో పోలీసులు జోక్యం చేసుకున్నందున అల్లర్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల విఘాతం కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నావీస్ అన్నారు. పోలీసులు అలర్ట్ గా ఉన్నారని, ఇతర ప్రాంతాల నుంచి అదనపు భద్రతా బలగాలను అక్కడ మోహరించినట్లు ఆయన చెప్పారు.
Also Read : IPL 2023 : గుజరాత్ తో పోటీకి సై అంటున్న సన్ రైజర్స్
అసలు ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలోని అకోలా నగరంలో శనివారం ఒక మత గురువు గురించి సోషల్ మీడియా పోస్ట్పై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా మరో 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ను అప్లోడ్ చేశాడు.. ఇది మరొక సంఘం మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ పాత నగరం హరిహరపేటలో ఘర్షణలు జరిగాయి.
Also Read : Krithi Shetty: దెబ్బ మీద దెబ్బ.. బేబమ్మకి ఏమైంది?
ఈ ఘటన తర్వాత నగరంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం సిఆర్పిసి సెక్షన్ 144 విధించింది. అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని అకోలా అదనపు ఎస్పీ మోనికా రౌత్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఔరగాబాద్లోని ఒక దేవాలయం సమీపంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పరిస్థితిని నియంత్రించడానికి వెళ్లిన పోలీసులపైకి సుమారు 500 మందితో కూడిన ఓ గుంపు రాళ్లు, పెట్రోల్ నింపిన బాటిళ్లను విసిరారు.. దీంతో 10 మంది పోలీసులతో పాట మరో 12 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Healthy Jackfruit Tacos : హెల్తీ మినీ జాక్ఫ్రూట్ టాకోస్.. టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి.!
-
Monalisa : సిపిఎం అగ్రనేతలకు మోనాలిసా ‘పోక్సో’ సెగ?
-
TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
-
EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!